Telangana PCC: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు.2018 అసెంబ్లీ ఎన్నికల్లో,2019 లోక్సభ ఎన్నికల్లో,గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ,దుబ్బాక, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ పీసీసీ అధ్యక్ష పదవిపై చాలామందికి మోజు ఉంది.ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి చాలా రోజులైంది.
దాన్ని భర్తీ చేసే ప్రక్రియను కాంగ్రెస్ చేపట్టింది.ఇక నాగార్జుసాగర్ ఉపఎన్నిక రావడంతో సీనియర్ నేత జానారెడ్డి విజ్ఞప్తి మేరకు ఆ ప్రక్రియను కొద్దికాలం వాయిదా వేశారు.ఒకవేళ ఆ ఉపఎన్నికలో జానారెడ్డి గెలిచి ఉంటే ఆయనే పీసీసీ అధ్యక్షుడిగా అధ్యక్షుడయ్యేవారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.కాని ఓడిపోవడంతో జానారెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించేశారు.దీంతో మళ్లీ పీసీసీ చీఫ్ పదవి పై లాబీయింగ్ మొదలైంది.
రేసులో ముందు వరుసలో ఆ ఇద్దరు!
కాగా తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి ఎంపీలు రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధానంగా పోటీ పడుతున్నారు.ఇద్దరూ కూడా ఎంపీలే.నిజానికి వెంకట్రెడ్డి కాంగ్రెస్ లో సీనియర్ మోస్ట్.రేవంత్ రెడ్డి టిడిపి నుండి వచ్చి కాంగ్రెస్ లో చాలా స్వల్పకాలంలో పైకెదిగారు.పైగా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్రెడ్డి అయితేనే పీసీసీ చీఫ్ గా సీఎం కెసిఆర్ ని ఎదుర్కోగలరన్న అభిప్రాయం రాహుల్ కి ఉందని ,అందువల్ల రేవంత్ రెడ్డి మెడలో వరమాల పడగలదని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్న తరుణంలో మరో సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రంగంలోకి వచ్చారు.
Read More: Harish Rao: పుట్టినరోజున హరీశ్ రావు సంచలన నిర్ణయం… వైరల్ అవుతున్న ప్రకటన
నేనూ రేసులోనే ఉన్నానన్న జగ్గారెడ్డి
తాను కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నట్లు జగ్గారెడ్డి బుధవారం బహిరంగంగా ప్రకటించారు.తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయన్నారు.” ప్రజల కష్టాలు తీర్చే మెడిసిన్ నా వద్ద ఉంది. ఆనందయ్య లాంటి మందు అందుబాటులో ఉంది. సోనియా పీసీసీ పదవిని ఎవరికి ఇచ్చినా నాకు సమ్మతమే.నాకు ఇస్తే మరీ బాగుంటుందని జగ్గారెడ్డి తన మనసులో మాట చెప్పారు.ఇంకా ఈ పదవిపై ఆశ ఉన్న కాంగ్రెస్ నేతలు వారెందరో ఉన్నారు.ఒక్కొక్కరుగా బయటకు వస్తారేమో చూడాలి.