Tollywood: మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక పరిస్థితులు చాలావరకు మారిపోయాయి. గత ప్రపంచానికి ప్రస్తుత ప్రపంచానికి చాలా తేడాలు వచ్చాయి. రాబోయే రోజుల్లో కూడా అనేక రంగాలలో వివిధ మార్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఇలాంటి తరుణంలో మహమ్మారి వల్ల ఎక్కువ నష్టపోయిన సినీరంగం .. ప్రత్యామ్నాయంగా ఓటిటి వైపు చూస్తోంది. ఇప్పటికే చాలా మంది సినిమా నిర్మాతలు.. ఎవరికివారు సొంతంగా ఓటిటి.. ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆహా.. అదేవిధంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా సొంతంగా తనకంటూ ఓటిటి ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నటు టాక్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో చాలావరకు ఓటీటీ ని మొన్నటివరకు లైట్ తీసుకున్న టాప్ హీరోలు… ప్రస్తుత పరిస్థితులు బట్టి ఓటిటి వైపు చూస్తున్నారు. దీనిలో భాగంగా సీనియర్ హీరోలు సైతం కూడా ఈ బాట పడుతున్నారు.
Read More: Venkatesh Narappa : అందరూ ఎదురుచూస్తున్న వెంకటేష్ నారప్ప సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది..!!
మేటర్ లోకి వెళ్తే సీనియర్ హీరోలలో ఎప్పుడూ కొత్తదనం అందించే విక్టరీ వెంకటేష్… ఇప్పుడు ఓటీటి లో సినిమా చేయడానికి రెడీ అయినట్లు టాక్. తాజాగా కేరాఫ్ కంచరపాలెం డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వంలో ఫస్ట్ డిజిటల్ మూవీ సినిమా చేయడానికి వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అని టాక్. ఈ సినిమాకి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేసి ఓటిటీలో రిలీజ్ చేయాలని… వెంకటేష్ భావిస్తున్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!