భారతదేశం చాలా గొప్ప దేశం అని చెప్పడానికి యోగ ఒక నిదర్శనం. ప్రపంచం మొత్తానికి యోగాని పరిచయం చేసింది మన దేశం. యోగ లో చాల ఆసనాలు ఉంటాయి .వాటిలో ప్రాణాయామం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.ప్రాణాయామం మన శరీరం ఉండే ప్రతి కణానికి శక్తివచ్చేలా చేసే ఆసనం.
రోజూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలుతెలుసుకుందాం..
ఒక్క ప్రాణాయామం చేయడం తో మన శరీరం లోఉండే 80 వేల నరాలు శుద్ధి అవుతాయి. ఇలా శుద్ధి అవ్వడం వల్ల మన శరీరంలోని శక్తి ప్రసరణ మెరుగవుతుంది. దీనితో శరీరం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రాణాయామం రోజు చేయాలని చాలా మంది ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది రోజు చేయడం వల్లఒత్తిడిని పోగొట్టి ప్రశాంతతను ఆరోగ్యాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
చాలామంది ధ్యానం చేస్తూ యోగ చేయకుండా పక్కన పెట్టేస్తుంటారు. శారీరక దృఢత్వాన్ని సాధించడానికి ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది.దీని వల్ల శరీరం లోని అన్ని అవయవాల కు స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది.కాబట్టి ఇది మీ జీర్ణవ్యవస్థ ను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా మీ శరీర కాంతి పెంచుతుంది.సహజం గా మీ శరీరానికి మెరిసిపోవాలంటే రోజు ప్రాణాయామం చెయ్యాలి. ఈ రోజుల్లో అందరుతీరిక లేని జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల ఒత్తిడి పెరిగి పోయి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తగ్గిపోతుంది. ప్రాణాయామం చేయడం చాలా తేలిక అనిపిస్తుంది, కానీ క్రమ శిక్షణ తో చేయాలి. సరిగా క్రమబద్ధంగా శ్వాస తీసుకోవడమే ప్రాణాయామం. కాబట్టి ప్రాణాయామం చేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపండి.