స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ధృవ తీసి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో ఏకంగా మెగస్టార్ తన డ్రీం ప్రాజెక్ట్ సైరా కి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని సురేందర్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నాడు. మేకింగ్ పరంగా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ సినిమా కోసం దాదాపు సంవత్సరం పైగానే వేయిట్ చేశాడు. ఎట్టకేలకి ఒకేసారి రెండు ప్రాజెక్ట్స్ ని కన్ఫర్మ్ చేశాడు.
రాం తాళ్ళూరి నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు. అలాగే అక్కినేని హీరో అఖిల్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ సినిమా మొదలవడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే ముందు అఖిల్ తో సినిమా కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే సురేందర్ రెడ్డితో అఖిల్ సినిమా మొదలవనుంది.
కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా భారీ స్థాయిలో రూపొందించబోతున్నట్టు సమాచారం. అఖిల్ మొదటి సినిమా కమర్షియల్ ఇమేజ్ కోసం చేసినా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అఖిల్ కి హిట్ ఇవ్వలేకపోయాయి. ఇక ప్రస్తుతం చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ తో పాటు సురేందర్ రెడ్డి సినిమా తోను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని అఖిల్ ప్లాన్ చేసుకుంటున్నాడట.
అందుకే సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాతో పాటు అఖిల్ సినిమాకి కథ విషయంలో భారీ తనం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రెండు సినిమాలని పాన్ ఇండియన్ సినిమాలుగా తెరకెక్కించాలని చూస్తున్నాడట. అంతేకాదు ఈ రెండు సినిమాలకి వక్కంతం వంశీ కథ అందిస్తున్నట్టు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!