టాలీవుడ్ లో ఇలా వచ్చి అలా ఫేడౌట్ అయిన దర్శకుడు మెహర్ రమేష్. సినిమాని భారీ స్థాయిలో ..హాలీవుడ్ రేంజ్ లో క్లాసీగా తెరకెక్కించ గల సత్తా ఉన్నప్పటికి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గా మిగిలాయి. మెహర్ రమేష్ తెలుగులో తీసింది నాలుగు సినిమాలే. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో కంత్రీ, శక్తి, ప్రభాస్ తో బిల్లా, విక్టరీ వెంకటేష్ తో షాడో. ఈ సినిమాలలో ఒక్కటి కూడా భారీ హిట్ గా నిలవ లేకపోయింది. వెంకీ తో తీసిన షాడో తర్వాత మళ్ళీ దర్శకుడిగా కనిపించలేదు మెహర్ రమేష్.
అయితే ఆ మధ్య మెగాస్టార్ సినిమాలు చేయాలనుకున్న దర్శకుల జాబితాలో మెహర్ రమేష్ పేరు కూడా చిరంజీవి ప్రస్తావనకి తీసుకురావడం అందరికీ షాకిచ్చింది. అంతేకాదు తాజాగా మెగాస్టార్ ఈ దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చిరంజీవి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం రీమేక్ లో నటించనున్నారని సమాచారం. 2015లో మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లో భారీ కమర్షియల్ హిట్ ని అందుకుంది.
ఈ సినిమా కథ విపరీతంగా నచ్చిన చిరంజీవి తెలుగు రీమేక్ లో నటించాలనుకున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా మెహర్ రమేష్ ని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి ఫ్యామిలీకి బాగా సన్నిహితుడవడంతోనే మెహర్ రమేష్ కి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈ మూవీని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో ప్రముఖ సీనియర్ నిర్మాత కె ఎస్ రామారావు, రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో కలిసి నిర్మిస్తారని సమాచారం. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు గాని అభిమానులు మాత్రం మెహర్ రమేష్ తో సినిమా అంటే అంత ఆసక్తి కనబరచడం లేదట.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!