Ram charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా క్రియేటివ్ జీనియస్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చరణ్ కెరీర్ లో 15వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. చెన్నైలోనే ఈ సినిమాకి సంబంధించిన వర్క్ అంతా జరుగుతోంది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్ కాస్టింగ్ ని ఫైనల్ చేస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాలో చరణ్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వాణీని ఎంపిక చేసినట్టు అధికారకంగా ప్రకటించారు.
ఇదే క్రమంలో మరికొన్ని కీలక పాత్రలను ఫైనల్ చేస్తున్నారట. ఇందులో భాగంగానే మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నట్టు తెలుస్తోంది. చరణ్ 15లో ఓ పవర్ ఫిల్ లేడీ విలన్ గా తమన్నా నటించనుందట. హీరోతో సమానంగా ఉండే ధీటైన పాత్రలో తమన్నాని శంకర్ అద్భుతంగా చూపించనున్నట్టు తెలుస్తోంది. శంకర్ సినిమాలలో హీరోయిన్స్ ని ఏ రేంజ్ లో ఎలివేట్ చేస్తారో అందరికీ తెలిసిందే. అలాగే భారీ స్థాయిలో తమన్నా పాత్రని తయారు చేస్తున్నారట.
Ram charan: తమన్నా ఫైనల్ అయితే ఆమె రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్..!
బాహుబలి, సైరా నరసింహారెడ్డి తర్వాత మళ్లీ ఆ స్థాయి సినిమా అంటే శంకర్ చరణ్లదే అని చెప్పాలి. ఈ సినిమా గనక చేస్తే ఇక బాలీవుడ్లో కూడా తన సత్తా చాటడం గ్యారెంటీ అంటున్నారు. కాగా ఇక ఈ ఇదే సినిమాలో ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు కూడా 20 నిమిషాలకి పైగా నిడివి ఉండే పాత్రలో నటించనున్నట్టు సమాచారం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్తో కలిసి భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఇక ఇందులో కియారా అద్వాణీ అందుకునే రెమ్యునరేషన్ 5 కోట్లని ప్రచారం అవుతోంది. ఇక తమన్నా ఫైనల్ అయితే ఆమె రెమ్యునరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారనుందని చెప్పుకుంటున్నారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!