కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీలో గతంలో జరిగిన గూడుపుఠాణి లన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి!
కాంగ్రెస్ అనేది జాతీయ పార్టీ కాబట్టి రాష్ట్రాల్లో ఏం జరిగినా కూడా అది హస్తిన స్థాయిలోనే జరిగే దన్నది వాస్తవం.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తరచూ ముఖ్యమంత్రులు మారిపోయినా ఇంకా ఏమి జరిగినా కూడా అంతా ఢిల్లీలోనే!అయితే ఆ రోజుల్లో ఢిల్లీలో ఏమి జరిగిందన్నది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఒక కాంగ్రెస్ సీనియర్ మోస్టు నాయకుడు ఢిల్లీలో కాంగ్రెస్ లో ఎటువంటి కుట్ర రాజకీయాలు జరుగుతాయన్నది వివరించారు.ముఖ్యంగా చాలా సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇంచార్జిగా వ్యవహరించిన గులాం నబీ ఆజాద్ దుర్మార్గాల న్నింటినీ ఆ నాయకుడు వెల్లడించారు.
పిసిసి అధ్యక్షుడిగాను ,రాష్ట్ర మంత్రి గాను పనిచేసిన బి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడు.ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 1989లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది.కానీ మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. హనుమంతరావు మంత్రిగానే మిగిలిపోయారు.ఇదే విషయమై హనుమంతరావు ఇప్పుడు స్పందిస్తూ అప్పుడేం జరిగిందో చెప్పారు.
రాజకీయంగా గులాంనబి అజాద్ తన గొంతు కోశాడని.. లేకుంటే తాను ముఖ్యమంత్రిని అయ్యేవాడినని చెప్పారు. దివంగత మహానేత వైఎస్ పాదయాత్రకు కూడా గులాంనబీ అడ్డంకులు సృష్టించారన్నారు. అప్పట్లో పార్టీ ఎన్నికలు జరుగుతుంటే ఆయన జరగనివ్వలేదన్నారు. తనకు పదవులు ఉంటే ఒకలా.. పదవులు లేకుంటే మరోలా మాట్లాడే అలవాటుగులాంనబీ కి ఉందన్నారు.సోనియాగాంధీ రాహుల్ గాంధీ నాకు టైం ఇస్తే మరిన్ని విషయాలు చెబుతా’’ అని పేర్కొన్నారు. ఎప్పుడూ లేని విధంగా.. ఇంతకు ముందెప్పుడూ అనని రీతిలో అజాద్ ను హనుమంతరావు ఉతికిఆరేసిన౦త పని చేశారు.
గాంధీ ఫ్యామిలీ పై తిరుగుబాటు చేసే ధోరణితో వ్యవహరిస్తున్న గులాంనబీ అజాద్ గుంటనక్క లాంటివాడు అన్నాడు. అతని వ్యాఖ్యల వెనుక దురుద్దేశం ఉందని వీహెచ్ చెప్పారు గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకిస్తే తాము అండగా ఉంటామన్నారు.ఇలాగే విహెచ్ మాదిరి మరికొందరు కూడా ఆంధ్రప్రదేశ్ నేతలు బయటకొచ్చి కాంగ్రెస్ లోగుట్టు రాజకీయాలను బయట పెట్టే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు!