వైసీపీని గద్దె దింపాలని.. వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడాలని ఉందని పదే పదే చెబుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పు డు రాజకీయ వ్యూహంలో భాగమో.. లేక.. నిజంగానే ఇవ్వాలని అనుకున్నారో తెలియదు కానీ.. వైసీపీ కీలక నేత బంధువుకు.. టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారని తెలిసింది. దీనిపై సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ.. జనసేన నాయకుడు పట్టించుకోక పోవడం గమనార్హం. తన దారి తనదే అంటూ.. ఇప్పటికే నాయకులకు చెప్పేశారు. తనను ఎవరూ ప్రశ్నించడానికి వీల్లేదని కూడా ఆదేశించారు. దీంతో అందరూ మౌనంగా ఏం జరిగితే అదే జరుగుతుందని ఎదురు చూస్తున్నారు.
ఏం జరిగింది…
వైసీపీ నాయకుడు, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెలమలశెట్టి సునీల్ వ్యాపార వేత్త. ఆయనకు గ్రీన్ కో కంపెనీ ఉంది. ఈ కంపెనీలో ఆయన బంధువులే డైరెక్టర్లుగా ఉన్నారు. వీరు కూడా వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నారనేది తెలిసి న విషయమే. అయితే.. ఇక్కడే పెద్ద మేజిక్ జరిగింది. సునీల్ సమీప బంధువు అయిన.. బండారు నరసింహారావుకు జనసేన టికెట్ ఇస్తున్నారు. ఈయన గ్రీన్ కో కంపెనీలో నలుగురు డైరెక్టర్లలో ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఎక్కడ మెలిక తగిలిందో తెలియదు కానీ.. అనూహ్యంగా ఈయన పేరును మచిలీపట్నం పార్లమెంటు రేసులో పరిశీలన చేస్తున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నా యి.
మరోవైపు.. ఇదే జనసేన నాయకులు రెండు నెలల కిందట చెలమలశెట్టి వ్యాపారాలకు జగన్ భూ సంతర్పణ చేస్తున్నారంటూ రోడ్డెక్కారు. అదే కాకినాడలో ప్రెస్మీట్ పెట్టిన జనసేన పార్టీ నాయకుడునాదెండ్ల మనోహర్.. తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదల కు చెందిన భూములను కూడా.. సునీల్కు జగన్ కట్టబెడుతున్నారని… అత్యంత కారు చౌకకే ఈ భూ పందేరం జరిగిపోతోందని కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఇంతగా కన్నీరు పెట్టుకుని.. నెత్తీ నోరు బాదుకున్న కంపెనీకి చెందిన డైరెక్టర్ నరసింహారా వుకు ఇప్పుడు టికెట్ ఇచ్చేందుకు భారీ ప్రయత్నాలు జరుగుతుండడం రాజకీయంగా పార్టీలో కలకలం రేపుతోంది.
ఇక, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి.. వైసీపీని వీడి జనసేనలో చేరారు. ఆయనకు తొలుత ఎంపీ టికెట్నుఖరారు చేశా రు. దీంతో ఆయన ఖుషీ అయ్యారు. కానీ, ఇంతలోనే తెరచాటున ఏంజరిగిందో ఏమో(బీజేపీ ఉందనే టాక్ వినిపిస్తోంది) అనూ హ్యంగా బండారు నరసింహారావు పేరు తెరమీదికి వచ్చింది. దీంతో వల్లభనేనికి మచిలీపట్నం టికెట్ తీసేసి.. త్వరలోనే అసెంబ్లీకి పంపించాలనే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. అయితే.. బాలశౌరి మాత్రం దీనికి ఇష్ట పడడం లేదని తెలిసింది. అయిన్పటికీ.. ఆయనను నయాన ఒప్పించి అయినా.. బండారు కు టికెట్ ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతుండడం గమనార్హం.