ఇప్పటికే వచ్చే సంవత్సరం నుండి కార్ల ధరలు పెంచనున్నట్లు కొన్ని కార్ల కంపెనీలు ప్రకటించాయి..! ఇదే బాటలో ఇప్పుడు బైక్ కంపెనీలు కూడా నడుస్తున్నాయి..! హీరో మోటో కార్ప్ కొత్త సంవత్సరంలో తన మొత్తం ఉత్పత్తి శ్రేణిలో టూ వీలర్ ధరలను రూ.1500 వరకు పెంచనున్నట్లు ప్రకటించిన నా సంగతి తెలిసిందే..! యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ ద్వారా జావా మోటార్ సైకిల్స్ బ్రాండ్ భారత మార్కెట్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది..! ఇదే వరుసలో ఇప్పుడు జావా మోటార్ సైకిల్స్ విక్రయిస్తున్న మూడు మోడళ్ల ధరలను పెంచాలని కంపెనీ యోచిస్తుంది..!
జావా బ్రాండ్ ప్రధాన 3 మోడల్స్ క్లాసిక్, ఫోర్టి-టూ, పెరాక్ మోడల్స్. అయితే కచ్చితంగా గా ఏ మోడల్పై ఎంత ధర పెరుగుతుందో అనే విషయం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జావా మార్కెట్లో క్లాసిక్ ధర రూ.1.74లక్షలు, ఫోర్టి-టూ ధర రూ.1.65 లక్షలు, పెరాక్ మోటార్ సైకిల్ ధర రూ.1.94 లక్షలు గా ఉంది. పెరాక్ మోటార్ సైకిల్ బ్రాండ్ యొక్క ఫ్లాగ్షిప్ మోడల్ ఇది. ఇందులో 34 సిసి లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ డిహెచ్ సి ఇంజన్ ను ఉంచారు. ఈ ఇంజన్ గరిష్టంగా 30 బిహెచ్పిల శక్తిని, 32ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6- స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను జతచేశారు.
క్లాసిక్, ఫోర్టి-టూ రెండు మోడళ్లు ఒకే రకమైన ఇంజన్ ఆప్షన్లలో లభిస్తాయి. వీటిలో 28 సి సి సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ను ఉపయోగించారు ఈ ఇంజన్ గరిష్టంగా 26 బి హెచ్ పి 27 ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6- స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను జతచేశారు. భారత దేశ మార్కెట్లో జావా విక్రయించే మోటార్ సైకిళ్ళు ఆ విభాగాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ 350 లైనప్, బెనెల్లి ఇంపీరియల్ 400 మోడల్స్ కు ప్రత్యర్థిగా నిలుస్తాయి.