BJP: జార్ఖండ్ లో జేఎంఎం కు బిగ్ షాక్ తగిలింది. ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వదిన, జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్ ఇవేళ బీజేపీలో చేరారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ పరిణామం రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది. సీతా సోరెన్ జేఎంఎం కు రాజీనామా చేసి..బీజేపీ రాష్ట్ర నేతల సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త మరణం తర్వాత జేఎంఎంలో తనను పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. పార్టీలో తనను ఒంటరి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సీతా సోరెన్ మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె భర్త దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు. దుర్గా సోరెన్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్న. గత నెలలో మాజీ సీఎం హేమంత్ అరెస్టుకు ముందు ఆయన సతీమణిని ముఖ్యమంత్రి చేయాలని భావించగా, సీతా సోరెన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో పార్టీలోనే సీనియర్ నేతను ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆమె అకస్మాత్తుగా బీజేపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. జార్ఖండ్ లో ఎస్టీలు జేఎంఎంకు ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంది.
బీజేపీలో చేరికకు ముందు సీతా సోరెన్ పార్టీ అధినేతకు రాజీనామా లేఖ పంపారు. పద్నాలుగేళ్లుగా తాను పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ తనకు గౌరవం దక్కలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. జేఎంఎంలో తగిన గౌరవం దక్కనందుకే తాను పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాల మీద ఉన్న నమ్మకంతో బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. తన భర్త మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను కలిచి వేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
CAA: సీఏఏ పై సుప్రీం కోర్టులో విచారణ