వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. చాలా వరకు తమిళ రాజకీయాలను శాసించేది ఎక్కువగా సినిమా నటులే కావడంతో ఈసారి రజినీకాంత్ అదేవిధంగా కమలహాసన్ పార్టీలు పోటీకి దిగడంతో తమిళ రాజకీయ వాతావరణం రసవత్తరంగా ఉంది. జయలలిత అదేవిధంగా కరుణానిధి మరణించిన తర్వాత తమిళ రాజకీయాలు చల్లబడిపోయాయి.
ఇటువంటి తరుణంలో రజినీ, కమల్ పొలిటికల్ ఎంట్రీ లు ఇవ్వటంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాలు వేడెక్కాయి. కమలహాసన్ ఇప్పటికే ఎంఐఎం పార్టీ తో పొత్తు దాదాపు ఖరారు అయిపోయినట్లు తెలుస్తోంది. కనీసం 25 నియోజకవర్గాలలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడానికి ఓకే అన్నట్టు టాక్ వస్తుంది. ఇదిలా ఉండగా రజినీకాంత్ కొత్త పార్టీ పేరు ప్రకటించకుండానే ఆయనతో పొత్తుకి సై అంటున్నారు కమలహాసన్.
ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు ఉన్న వాటిని పక్కనపెట్టి ప్రజల కోసం కలిసి పని చేస్తామని కమల్ చెప్పుకొచ్చారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రజనీతో కలిసి పోటీ చేయడానికి తాను రెడీ అని చెప్పుకొచ్చారు. అయితే ఈ విషయంపై రజినీకాంత్ ఇంకా స్పందించలేదు. రజిని ఓకే అంటే మాత్రం తమిళ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోవటం గ్యారెంటీ అని విశ్లేషకులు తాజా వార్త పై వ్యాఖ్యానిస్తున్నారు.