ఎట్టకేలకు పదవ తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలను పూర్తిగా రద్దు చేసిన కేసీఆర్ సర్కార్ ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చి ఇంటర్మీడియట్ కు ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇకపోతే మధ్యాహ్నం నుండి సీఎం కేసీఆర్ విద్యా శాఖ మంత్రి తో పాటు పలువురు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి చివరికి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అలాగే లాక్ డౌన్ కారణంగా రెండు నెలల నుండి నిలిచిపోయిన సినిమా మరియు టివి సీరియల్ షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం థియేటర్లకు మాత్రం అనుమతి నిరాకరించింది.
అయితే ఇంతటి కీలక నిర్ణయాలను… అవి కూడా కరోనా వైరస్ కు ముడిపడి ఉన్న అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని అనౌన్స్ చేసేందుకు కేసీఆర్ మీడియా ముందుకు వస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ఈసారి మాత్రం అంతా ప్రకటనలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం
కెసిఆర్ ఇలా మీడియా ముందు రాకపోవడానికి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ కారణమనే చర్చ మీడియాలో జోరుగా సాగుతోంది. సీఎం కేసీఆర్ ముందుకు వస్తే కచ్చితంగా కేటిఆర్ అక్రమ ఫామ్ హౌస్ అంశం, 111 జీవో, కేటీఆర్ బర్తరఫ్ అంశంపై మీడియా వారి నుండి విపరీతమైన ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉంది. అదే మీడియా సమావేశం లేకపోతే ఇవన్నీ ఏమీ ఉండవని ఉద్దేశంతోనే కేసీఆర్ మొట్టమొదటిసారిగా మీడియా ముందుకు వచ్చేందుకు జంకారని తెలంగాణ ప్రజల్లో కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది.