వెన్నుపోటు రాజకీయాలకు బలైపోవడానికి జగన్ ఏమీ ఎన్టీఆర్ కాదు..’ అంటూబాలయ్యకు పోసాని కృష్ణమురళి వేసిన సెటైర్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది అదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇప్పుడిదంతా ఎందుకంటే, ‘అతి త్వరలో జగన్ ప్రభుత్వం కూలిపోతుంది.. టీడీపీ అధికారంలోకి వస్తుంది’ అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనడంపై.. సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణమురళి ‘వెన్నుపోటు’ సెటైర్ వేయడమే. గతంలో చంద్రబాబు భజన చేసిన పోసాని, ఇప్పుడు ఈ తరహా విమర్శలు చేయడమేంటి.? అంటూ పోసాని కృష్ణమురళిపై ‘మెంటల్ కృష్ణ’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వసమెత్తుతున్నారు టీడీపీ మద్దతుదారులు.మరోపక్క, వైఎస్ జగన్ ఏడాది పాలన తర్వాత, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిథులే ప్రభుత్వాన్ని, సొంత పార్టీని నిలదీస్తున్న వైనాన్ని ‘వెన్నుపోటుకి రంగం సిద్ధమవుతోంది’ అంటూ ప్రొజెక్ట్ చేస్తోంది సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్ళ దండు.రాజకీయాల్లో వెన్నుపోట్లు అత్యంత సహజం. ఒకడు పైకి రావాలంటే, ఇంకొకడ్ని తొక్కాల్సిందే.! తక్కువ కాలంలో అత్యున్నత స్థానానికి చేరుకోవాలంటే వెన్నుపోటు తప్పనిసరి. తెలుగు నాట వెన్నుపోటు రాజకీయం.. అనగానే, చాలామంది చంద్రబాబు పేరునే ప్రస్తావిస్తారుగానీ.. ఇలాంటి వెన్నుపోట్లు తెలుగు రాజకీయాల్లో కుప్పలు తెప్పలుగా జరిగాయి. అయినా వెన్నుపోటు పై పేటెంట్ చంద్రబాబుదే.ఏదేమైనా పోసాని కృష్ణ మురళి మార్కు సెటైర్ బాంబులా పేలింది!