Lata Mangeshkar : లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ (92) కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. దీంతో యావత్ సంగీత ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. తన గానామృతంతో కోట్లాదిమంది ప్రజలను మైమరపించిన లతా మంగేష్కర్ ఇక లేరనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దిగ్గజ గాయని నేడు అంటే ఫిబ్రవరి 6న పొద్దున 8 గంటల 12 నిమిషాలకు ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అయితే గాన కోకిల లతా స్వరం శాశ్వతంగా మూగబోయిన ఈ తరుణంలో ఆమె సంగీత ప్రపంచానికి ఎన్ని సేవలు చేశారో? ఆమె జీవిత విశేషాలు ఏంటో? ఆమెపై విష ప్రయోగం ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.
Lata Mangeshkar : లైఫ్ & మ్యూజిక్ కెరీర్
క్వీన్ ఆఫ్ మెలోడీ, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా వెలుగొందిన లతా మంగేష్కర్… 1929 సెప్టెంబరు 28న మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతి దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఆమె ఐదేళ్ల ప్రాయం నుంచే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారు. తన 13వయేటా ఆమె తండ్రి కన్నుమూశారు. దీంతో ఫైనాన్షియల్ గా ఫ్యామిలీకి సపోర్ట్ చేసేందుకు ఆమె ఆ వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ప్లేబ్యాక్ సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు. అలా 1942లో తొలిసారిగా ఒక మరాఠీ పాటతో సింగర్గా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మరాఠీ చిత్రం ‘కితీ హస్సల్’లోని “నాచు యా నా గాడే ఖేదు సారీ” అనే పాటను ఆమె పాడగా దాన్ని సినిమా నుంచి తొలగించారు. 1942 నుంచి 7 దశాబ్దాల్లో ఆమె 36 భారతీయ భాషలతోపాటు పలు విదేశీ భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
చాలా టాలెంటెడ్ సింగర్ అయిన ఆశా భోంస్లే లతా సోదరి అనే విషయం మనందరికీ తెలిసిందే. లతా ఒక్కరే కాదు ఆమె కుటుంబం నుంచి చాలామంది సినీరంగ ప్రవేశం చేశారు. ఆమె తండ్రి థియేటర్ను నడిపేవారు. ఆమె అక్కలు ఉష, మీయా ఇద్దరూ గాయకులే. పాపులర్ బాలీవుడ్ సినీ మ్యూజిక్ కంపోజర్ గులాం హైదర్ ఆమె పాపులర్ అవ్వడానికి కారణమయ్యారు. హైదర్ 1948లో మజ్బూర్ సినిమా కోసం ‘దిల్ మేరా తోడా’ పాట పాడమని లతకు ఆఫర్ ఇచ్చారు. ఈ పాటను అద్భుతంగా ఆలపించి ఆమె మంచి పేరు తెచ్చుకున్నారు.
భారత్-పాక్ విభజనలో ఖుర్షీద్, నుర్జహాన్ వంటి లెజెండరీ సింగర్స్ పాకిస్థాన్ వెళ్లిపోవడంతో లతా మంగేష్కర్ ఇండియాలో బెస్ట్ సింగర్గా అవతరించారు. 1949 లో వచ్చిన మహల్ అనే మరాఠీ రొమాంటిక్ హారర్ ఫ్లిక్ లో ఆమె ఆయేగా ఆనే వాలా పాట పాడి శ్రోతల హృదయాలను దోచేశారు. ఈ ఒక్క పాటతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది. తెలుగులో కూడా ఆమె పలు పాటలు పాడారు. మొట్టమొదటిగా ‘సంతానం (1955)’ సినిమా కోసం నిదుర పోరా తమ్ముడా అనే పాట పాడారు.
Lata Mangeshkar : అవార్డులు, గౌరవాలు
1948-78 మధ్య కాలంలో ఏకంగా 30 వేలకు పైగా పాటలు పాడి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో తన పేరును లిఖించుకున్నారు. అంతేకాదు 1969లో పద్మభూషణ్, 1999లో పద్మ విభూషణ్, 2001లో భారతరత్న అవార్డులను గెలుచుకున్నారు. కె.ఎల్.సైగల్ సాంగ్స్ ను లతా బాగా ఇష్టపడతారు. 1963 భారత్-చైనా యుద్ధ సమయంలో లతా ఆలపించిన అయే మేరే వతన్ కే లోగో పాట విని అప్పటి పీఎం జవహర్ లాల్ నెహ్రూ కంటతడి పెట్టుకున్నారు. Queen of Indian playback singers అని లతా మంగేష్కర్ గురించి టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. 1999లో లతా ఎయు డె పెర్ఫ్యూమ్ (Lata Eau De Parfum) అనే పర్ఫ్యూమ్ రిలీజ్ చేశారు.
లతాపై విష ప్రయోగం
1962లో గుర్తుతెలియని వ్యక్తులు లతా మంగేష్కర్పై స్లో పాయిజన్ ప్రయోగించారు. ఈ విష ప్రయోగం వల్ల లతా చాలా క్షీణించి పోయారు. మంచంపై నుంచి లేవడానికి కూడా ఆమెకు చేత కాలేదు అంటే ఎన్ని రోజుల పాటు ఆమెపై స్లో పాయిజన్ ప్రయోగించడం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే తన గొంతు పోగొట్టేందుకు ఎవరో కావాలనే తనపై విష ప్రయోగం చేస్తున్నారని ఆమె తెలుసుకున్నారు. అప్పట్నుంచి ఆమె విష ప్రయోగం నుంచి కోలుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. అనంతరం ఆమె మళ్లీ తన గానామృతం తో సినీ ప్రేక్షకులను అలరించారు. 1962లో ఆమె తగు జాగ్రత్తలు తీసుకునేవారు. ఆ సమయంలో దివంగత బాలీవుడ్ లిరిసిస్ట్ మజ్రూహ్ సుల్తాన్పురి మొదట ఆమె ఆహారాన్ని రుచి చూసి టెస్ట్ చేసేవారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!