Life lessons: ఒకరి బట్టలు ఇంకొకరు కట్టుకోకూడదు . అన్నదానం,జలదానం చేసేవారు సుఖమైనా మరణం పొందుతారు.సంకల్పం చెప్పుకోకుండా నది స్నానం చేయకూడదు.ఒకవేళ చేస్తే ఇంటిలో స్నానం చేసినట్టే అవుతుంది. నది స్నాన ఫలితం రాదు. ఉమితో వేళ్ళు తడిపి పుస్తకాల పేజీలను తిప్పకూడదు. వ్యసనపరులతో,మూర్ఖులతో వాదించకూడదు. విష్ణు ఆలయం లో 4 ప్రదక్షిణలు అమ్మవారి ఆలయం,cశివాలయం లో 3 ప్రదక్షణలు చేయాలి. ఆలయం లో ఆత్మ ప్రదక్షణ అన్నపుడు తనచుట్టూతానూ తిరగకూడదు. నమస్కారం చేస్తే చాలు. ఆలయం చుట్టూ మాత్రమే ప్రదక్షణ చేయాలి.
సంధ్య సమయం లో తినడం, నిద్ర పోవడం, శృంగారం చేయడం అస్సలు మంచిది కాదు.చీటికీ మాటికీ ఓట్లు పెట్టడం దోషం. దేవాలయ ప్రాంగణం లో ఉమ్మువేయడం, పొగ తాగడం రెండు నిషిద్దాలే.ఆదివారం,శుక్రవారం,మంగళవారం తులసి ఆకులు కోయరాదు.చీకటి పడ్డాక చెట్ల నుండి ఆకులు పువ్వులు కోయరాదు.చెట్లు,దేవతా విగ్రహాలు ఈశాన్యం లో ఉంటే బరువని భావించి తీసేసేవారు,తీసేయమని చెప్పినవారు ఏడూ జన్మలు ఉబ్బస రోగులుగా పుడతారు.
ఈ పనులు చేయడం దైవ ద్రోహం కాబట్టి చేయకూడదు.పాచి ముఖం తో అద్దం లో చూసుకురాదు. హారతి ఇచ్చాక దేవుడి పైన నీళ్లు చల్లాలి, హారతి ఇచ్చే పాత్ర మీద కాదు.ఉపవాసం ఉన్నప్పుడు, జాగరణ చేస్తున్నపుడు.. పరులదోషాలు తలచుకోరాదు. శివాలయం లో నదికి దగ్గరగా దీపారాధన చేయరాదు.. కొంచెం దూరంగా చేయాలి.గుడిలో తీర్థ తీసుకున్నాక చేతిని కడుక్కోవాలి కానీ తలకు రాసుకోకూడదు. ఆహారం విషయం లో చాల శ్రద్ధ వహించాలి..ఆహారం లోవెంట్రుకలు రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహారం లో వెంట్రుకలు రావడం దోషం గా చెప్పబడింది.
ఒకవేళ ఆహారం లో వెండ్రుకలు వస్తే అది విడిచి పెట్టి మళ్ళి వడ్డించుకోవాలి. అన్నం తింటున్నవారిని తిట్టడం దెప్పిపొడవడం వంటివి అస్సలు చేయరాదు.నిజాలు తెలియకుండా ఎవ్వరిని తిట్టడాం ,అబాండాలు వేయడం వంటివి చేయరాదు.అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అబాండాలు వేసినవారికి చుట్టుకుంటాయి. అష్టమి, పూర్ణిమ, చతుర్దశి కాలాల్లో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాదులకు లోటు ఉండదు.శవాన్ని మోసిన, ఇంటి దగ్గర ఉండడానికి అనుమతించిన నరకానికి పోకుండా స్వర్గానికి పోతాము.గృహ ప్రవేశ కాలం లోకానీ ,ఆ ఏడాది లోపుకాని ఆ ఇంటమణి ద్విప వర్ణన పారాయణం చేయడం మంచిది.వాస్తు దోషాలను నివారిస్తుంది.తలకు నూనె రాసుకుని ఆ జిడ్డును తిరిగి పాదాలకు రాసుకోకూడదు.