Lock Down : దేశంలో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మొదటి సారి ఇండియాలో వైరస్ వచ్చిన ప్రారంభంలో.. ఏ ఏ రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉందో.. ఆ ప్రాంతాలలో ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర అదేవిధంగా కేరళ కర్ణాటక వంటి చోట సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లు వార్తలు రావడంతో మహారాష్ట్ర పొడుగు రాష్ట్రం తెలంగాణ అప్రమత్తమైంది.
ముందుజాగ్రత్తగా మహారాష్ట్ర నుండి వచ్చే ప్రతి ఒకరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహారాష్ట్ర నుండి ఎక్కువగా అదిలాబాద్ మరియు నిజామాబాద్ జిల్లాలకు రాకపోకలు ఎక్కువగా ఉండటంతో.. ఆ రెండు జిల్లాల లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయినట్టు సమాచారం. పరిస్థితి ఇలా ఉండగా గా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఏ ఏ రాష్ట్రాలలో కరుణ తీవ్రత ఎక్కువగా ఉందో అక్కడికి కేంద్ర ఉన్నత స్థాయి బృందాలను తరలించడం జరిగింది. ఈ క్రమంలో కరుణ నిబంధనలను పాటించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంత మాత్రమే కాక కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కేరళ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్కు ముగ్గురు సభ్యులతో కూడిన వైద్య బృందాలను పంపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఖచ్చితంగా ఇండియాలో సెకండ్ వేవ్ రావటం గ్యారెంటీ అనే టాక్ అంతర్జాతీయస్థాయిలో బలంగా వినబడుతోంది. చాలా వరకు మాస్కులు లేకుండా కరోనా నియమ నిబంధనలు పాటించకుండా జనాలు వ్యవహరించటం వల్ల కరోనా వైరస్ అనేక రీతులుగా బలపడినట్లు తీవ్రత ఎక్కువైతే ఇండియా భారీ మూల్యం చెల్లించుకోవడం గ్యారెంటీ అని అంతర్జాతీయ వైద్య బృందాలు తెలుపుతున్నాయి. దీంతో దేశంలో మళ్లీ లాక్ డౌన్ గ్యారెంటీ అనే టాక్ బలంగా వినబడుతోంది.