ప్రభాస్.. ప్రభాస్.. ప్రభాస్.. ఇప్పుడు సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలతో పాటు దేశంతా ప్రభాస్ పేరు మార్మోగిపోతుంది. మన దేశీయ సినీ మార్కెట్ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా మన తెలుగు హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ని సాధించాడు. బాహుబలి నుంచి వచ్చిన స్టార్డం తో సాహో చేశాడు. ప్రస్తుతం అదే కంటిన్యూ చేస్తూ మూడు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు ప్రభాస్. ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలుసుకున్న టాలీవుడ్ అండ్ బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ప్రభాస్ డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారట.
ఈ క్రమంలో ఇప్పుడు ప్రభాస్ అత్యంత భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కో ప్రాజెక్ట్ దాదాపు 2000 వేల కోట్ల వరకు వసూళ్ళు సాధిస్తుందన్న ధీమాని వ్యక్తం చేస్తున్నారట మేకర్స్. అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మూడు భారీ ప్రాజెక్ట్స్ లో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ ఓంరౌత్ రూపొందించబోతున్న “ఆదిపురుష్” కి కేటాయించిన బడ్జెట్ ఎవరూ ఊహించ లేకపోతున్నారట. దాదాపు 750 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మాట మాత్రం ఇంకోలా ఉంది. ముందు అనుకున్న 750 కోట్ల బడ్జెట్ కి మించి కూడా పెట్టేలా ఉన్నారట మేకర్స్. అంతేకాదు ఈ సినిమాని మన దేశంలోనే భారీ బడ్జెట్ సినిమాలా ఎవరూ ఊహించని విధమగా రూపొందించాలని ప్రణాళిక వేసుకున్నారట. ఇదంతా కేవలం ప్రభాస్ బాక్సాఫీస్ స్టామినా పై ఉన్న నమ్మకమే అని అంటున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. అంతేకాదు 2020 డిసెంబర్ వరకు ఈ సినిమా పూర్వబోతుందట. గోపికృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపక పదుకొణె నటిస్తుంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!