SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నారు. ప్రస్తుత పరిస్థితులు బట్టి చూస్తే రాజమౌళి సినిమా కంటే ముందే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ అవుతుందని ఫిలిం వర్గాలు అంటున్నాయి. ఇటువంటి తరుణంలో ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట” సినిమా బ్యాలెన్స్ షెడ్యూల్ అతి తక్కువ టైంలో కంప్లీట్ చేయాలని ప్రస్తుతం మహేష్ సినిమా యూనిట్ కి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో షూటింగు ఎటువంటి ఆటంకం కలగకుండా.. సెట్ లో పనిచేసే ప్రతి ఒక్కరు వ్యాక్సింగ్ చేయించుకున్న కి రావాలని.. ఆదేశాలు ఇవ్వడం జరిగినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా డైరెక్టర్ పరుశురాం మహేష్ కి ప్రతినాయకుడి పాత్రలో ఎవరిని తీసుకోవాలన్న దానిపై.. సౌత్ ఇండియాలో ఇద్దరు ప్రముఖ నటులను ఆలోచన చేస్తున్నట్లు వారిద్దరిలో ఎవరిని తీసుకోవాలన్న దానిపై టెన్షన్ పడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
Read More: Mahesh Babu: రాజమౌళి- మహేష్ సినిమా గురించి కీలక అప్డేట్ ఇచ్చిన నిర్మాత..!!
బ్యాంకు రాబరీ తరహ సినిమా కావడంతో.. విలన్ క్యారెక్టర్ ప్రొఫెషనల్ గా.. డైరెక్టర్ పరుశురాం డిజైన్ చేయడం జరిగిందట. దీంతో యాక్షన్ కింగ్ అర్జున్ లేదా అరవింద స్వామి ని తీసుకోవాలా అనే దాని విషయంలో కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు ఫిలిం నగర్ టాక్. దాదాపు సినిమాకి సంబంధించి కామెడీ ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు పూర్తయినట్లు.. నెక్స్ట్ మొత్తం యాక్షన్ యాంగిల్ సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు.. దీంతో వీరిద్దరి లో ఎవరిని తీసుకోవాలి అన్న దాని విషయంలో మహేష్ మరియు సినిమా డైరెక్టర్ పరుశురాం డిస్కషన్లు చేసుకుంటున్నట్లు సమాచారం.