Mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబుతో సందీప్ రెడ్డి వంగా సినిమా ఉండబోతుందని అర్జున్ రెడ్డి సినిమా విడుదలయినప్పటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ తర్వాత సందీప్ రెడ్డి నుంచి గానీ, మహేష్ బాబు నుంచి గానీ కన్ఫర్మేషన్ రాలేదు. మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలు పూర్తి చేశాడు. సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ గా కబీర్ సింగ్ చేసి సెన్షేషనల్ హిట్ అందుకున్నాడు. ఒకే కథతో టాలీవుడ్ లో బాలీవుడ్ లో సంచలన విజయాలను అందుకొని సెన్షేషన్ క్రియేట్ చేశాడు. కానీ టాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రం ఆయనతో సినిమా చేయడానికి డేట్స్ ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.
కానీ బాలీవుడ్ లో మాత్రం సందీప్ వంగాకి బాగా క్రేజ్ ఉంది. అక్కడ స్టార్ హీరోలు ఆయనతో సినిమా చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ఎనిమీ అనే సినిమా చేయబోతున్నాడు. ఇందులో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా కథ వాస్తవంగా మన తెలుగు హీరోలకి చెప్పాడట సందీప్ వంగ. కానీ మన హీరోలకి ఈ కథ నచ్చలేదని టాక్ వినిపించింది. అందుకే ఇదే కథతో బాలీవుడ్ లో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. అక్కడ ఇలాంటి కథకి మంచి క్రేజ్ ఉంటుంది.
Mahesh babu : సందీప్ వంగా తో మహేష్ ప్రాజెక్ట్ మొదలవనుందట
అయితే బాలీవుడ్ లో ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేయగానే ఇక ఇప్పట్లో మన తెలుగు హీరోలతో సందీప్ రెడ్డి సినిమా ఉండదని అందరూ భావించారు. కానీ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సందీప్ రెడ్డి వంగా ఆయనతో ప్రాజెక్ట్ ఉన్న విషయాన్ని స్పష్టం చేశారు. సర్కారు వారి పాట, అలాగే త్రివిక్రం ప్రాజెక్ట్స్ ప్రస్తుతం మహేష్ చేతిలో ఉన్నాయి. ఆ తర్వాత డిలే అవకుండా రాజమౌళి ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వస్తే ఓకే. లేదంటే సందీప్ వంగా తో మహేష్ ప్రాజెక్ట్ మొదలవనుందని..దానికి తగ్గట్టే ఆయన పక్కా స్క్రిప్ట్తో రెడీగా ఉన్నట్టు హింట్ ఇచ్చాడు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వెల్లడించే అవకాశాలున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!