సూపర్ స్టార్ మహేష్ బాబు ఏంటి డర్టీ పిక్చర్ ఏంటని కంగారు పడుతున్నారా? టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. అసలు కథ వేరే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫామ్ మాములుగా లేదు. ఈ ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమా విజయంతో ఏకంగా హ్యాట్రిక్ ను పూర్తి చేసుకున్నాడు మహేష్ బాబు. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ ను పూర్తి చేసిన మహేష్ ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కించి విషయం తెల్సిందే. పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేయనున్నాడు మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలవుతుందని తెలుస్తోంది.
బ్యాంకింగ్ రంగంలో మోసాలను ఎట్టి చూపే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని అర్ధమవుతోంది. మహేష్ ఈ చిత్రంలో ఎన్నారై పాత్రలో కనిపిస్తాడట. కథ రీత్యా కొంత భాగం షూటింగ్ యూఎస్ లో జరుగుతుంది. సర్కారు వారి పాట షూటింగ్ కూడా మొదట యూఎస్ లోనే మొదలవుతుంది. అందుకనే పరశురామ్ అండ్ కో త్వరలో యూఎస్ కు వెళ్లి షూటింగ్ లొకేషన్స్ ను ఫైనల్ చేసుకుని వస్తారట. మరోవైపు ఈ సినిమా సంగీత దర్శకుడైన ఎస్ ఎస్ థమన్ మ్యూజిక్ సిట్టింగ్స్ ను మొదలుపెట్టాడు.
వచ్చే నెలకల్లా సాంగ్స్ ను కూడా ఫైనల్ చేసేస్తారు. ఇక అసలు విషయానికొస్తే ఈ సినిమా కాస్టింగ్ విషయంలో అస్సలు టీమ్ ఎక్కడా తగ్గకూడదు అనుకుంటున్నారు. ఈ చిత్రంలో విలన్ గా నటించడానికి అనిల్ కపూర్ ను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే అతి ముఖ్యమైన మహేష్ అక్క పాత్ర కోసం విద్యా బాలన్ ను కన్ఫర్మ్ చేశారట. విద్యా బాలన్ తెలుగు వారికి డర్టీ పిక్చర్ ద్వారా సుపరిచిత్రం. అలాగే ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకూ నిజముందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.
Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!