Manchu Manoj: సినీనటుడు మంచు మనోజ్ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని కలిశారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడాన్ని గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు మనోజ్. రానున్న సంవత్సరంలో చేయబోయే పనుల గురించి అడిగి తెలుసుకున్నానన్నారు. జగన్మోహనరెడ్డి అనుకున్న పనులు అన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానని మనోజ్ ట్వీట్ చేశారు. జగన్ అందిస్తున్న అద్భుతమైన పాలనకు శుభాకాంక్షలు తెలియజేశారు మంచు మనోజ్.
ఈ ఏడాది జనవరి నెలలో మంచు విష్ణు, విరోనిక మంచు దంపతులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్మోహనరెడ్డి, వైఎస్ భారతి దంపతులను కలిసిన సంగతి తెలిసిందే బంధువులైన ఇరు కుటుంబాల వారు కలిసి సీఎం నివాసంలో లంచ్ చేశారు. గత ఎన్నికలకు ముందు మోహన్ బాబు ఆయన తనయులతో కలిసి వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే.
వైఎస్ కుటుంబంతో బంధుత్వం ఏర్పడిన తరువాత వైఎస్ జగన్ ను మనోజ్ బావా అంటూ సంబోధిస్తుంటారు. మంచు మనోజ్ వదిన విష్ణు భార్య విరోనిక వైఎస్ కుటుంబానికి చెందిన ఆడబిడ్డ, విరోనిక వైఎస్ జగన్ బాబాయి సుధీర్ రెడ్డి కుమార్తె. జగన్ కు సోదరి వరుస. ఈ బంధుత్వం కారణంగా మోహన్ బాబు కుటుంబం జగన్మోహనరెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు.
It was an honor and privilege to meet the visionary CM Of Andhra Pradesh Shri @ysjagan garu.
Heard his plans for the near future which are quite promising.
Sir, may God bless you with abundance strength & good health to accomplish your vision.
Best wishes for ur Governance. pic.twitter.com/Mv0hMc65AC— Manoj Manchu??❤️ (@HeroManoj1) September 6, 2021
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!