Modi Vs KCR: ఓ పక్క ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ పర్యటన వచ్చిన సమయంలోనే ఇక్కడి తెలంగాణ సీఎం, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ బెంగళూరు (కర్ణాటక) కు వెళ్లారు. హైదరాబాద్ లో బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మోడీ.. తెలంగాణలో కేసిఆర్ కుటుంబ పాలన గురించి విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, ఏంతో మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చిందని అంటూ మాట్లాడారు. ఇక్కడ హైదరాబాద్ లో కేసిఆర్ సర్కార్ పై మోడీ విమర్శలు చేయగా, జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకై కంకణం కట్టుకున్న కేసిఆర్ బెంగళూరులో ,జేడిఎస్ నేతలు మాజీ ప్రధాని దేవగౌడ, మాజీ సీఎం కుమార స్వామిలతో భేటీ అయి జాతీయ రాజకీయాలపై చర్చించారు. అనంతరం కేంద్రంలో మోడీ సర్కార్ తీరుపై విమర్శలు గుప్పించారు కేసిఆర్.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Modi Vs KCR:రాబోయే రెండు నెలల్లోై సంచలన వార్త
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఇంకా తాగునీరు. విద్యుత్, సాగునీరు కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారని కేసిఆర్ అన్నారు. దేశ రాజకీయాలపై దేవగౌడ, కుమార స్వామిలతో చర్చించినట్లు చెప్పారు. దేశంలో గుణాత్మక రావాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే రెండు నెలల్లోై సంచలన వార్త వింటారని అన్నారు కేసిఆర్. జాతీయ స్థాయిలో మార్పు వచ్చి తీరుతుందని పేర్కొన్న కేసిఆర్ .. కాంగ్రెస్, బీజేపీ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ పడిపోయిందన్నారు. జీడీపీలో ఇండియాను చైనా అధిగమించిందని అన్నారు కేసిఆర్. సంకల్పం ఉంటే మన దేశాన్ని అమెరిికా కంటే ఆర్ధికంగా బలమైన దేశంగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఇంతకు ముందు కేసిఆర్ ఢిల్లీకి వెళ్లి పలువురు నేతలతోనూ భేటీ అయిన సంగతి తెలిసిందే. రెండు మూడు నెలల్లోై సంచలన వార్త వింటారని కేసిఆర్ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.