Prabhas: “బాహుబలి” సినిమా తో ప్రభాస్ క్రేజ్ ఊహించని విధంగా పెరిగి పోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీ పరిమితమైన ప్రభాస్… పాపులారిటీ బాహుబలి దెబ్బకి నేషనల్ వైడ్ స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఒక్క మనదేశంలో మాత్రమే కాక ప్రపంచ స్థాయిలో కూడా ప్రభాస్ మార్కెట్ విస్తరించింది. దీంతో డార్లింగ్ తో సినిమాలు చేయడం కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా 15 దేశీయ భాషల్లో తెరకెక్కుతున్న ట్లు సమాచారం. ఆగస్టు మాసంలో సినిమా రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారట. అయితే ఈ క్రమంలో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా 20 వేల స్క్రీన్స్ లో ఆది పురుష రిలీజ్ చేయాలని నిర్మాతలు డిసైడ్ అయ్యారట. ప్రభాస్ మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగానే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ఇప్పటి నుండే స్టార్ట్ చేస్తున్నట్లు… త్వరలో క్లారిటీ వచ్చాక వచ్చే సమ్మర్ నుండి మే నెలాఖరు నుండి ఆదిపురుష్ ప్రమోషన్స్ జరగనున్నట్లు బాలీవుడ్ వర్గాలు తెలియజేస్తున్నాయి.
ఒక ఈ సినిమా మాత్రమే కాక ఇకనుండి ప్రభాస్ తన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో.. అనేక భాషలలో అనువాదం చేయాలని ఇంటర్నేషనల్ స్థాయిలో తిరుగులేని మార్కెట్ సొంతం చేసుకునే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు టాక్. ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యాం, ఆది పురుష్, సలార్ సినిమాలు చేస్తున్నారు. వీటి తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అదేవిధంగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా సబ్జెక్టులు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అత్యధిక భారీ థియేటర్లలో రిలీజ్ చేయాలని ప్రభాస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!