RRR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తో దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మరియు RRR నిర్మాత డివివి దానయ్య తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. RRR ఈ నెల 25వ తారీకు విడుదల కానున్న తరుణంలో… ఏపీ కొత్త జీవో కి సంబంధించి.. క్రికెటర్ వివాదానికి సంబంధించి పంచడం జరిగింది. ముఖ్యమంత్రితో భేటీ తర్వాత రాజమౌళి మరియు దానయ్య మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రాజమౌళి తెలిపారు.
“ఆర్ఆర్ఆర్” భారీ బడ్జెట్ సినిమాలు కొత్తగా ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్.. హామీ ఇచ్చినట్లూ స్పష్టం చేశారు. “ఆర్ఆర్ఆర్” ఈ నెల 25వ తారీకు రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా టిక్కెట్ల ధరల గురించి.. కొత్త జీవో గురించి … తాజా భేటీలో చర్చకు వచ్చినట్లూ టాక్. బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా పై దేశ విదేశాల లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ టైం ఎన్టీఆర్ మరియు చరణ్ కలిసి నటించడంతో నందమూరి మరియు మెగా అభిమానలు సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటించారు… ఇక, ఆలియా భట్, ఒలీవియా మోరిస్హీరోయిన్లుగా.. అజయ్దేవ్గన్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాత డీవీవీ దానయ్య కాగా.. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 7వ తారీకు విడుదల కావాల్సి ఉండగా కరోనా కేసులు పెరగటంతో… మార్చి 25 కి వాయిదా వేశారు. ప్రస్తుతం బయట వాతావరణం మరింత సానుకూలంగా ఉండటం “RRR” ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల టాక్.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!