ఒక భాషలో హిట్టైన సినిమాను అయితే డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారు.. లేదా రీమేక్ హక్కులను కొనుగోలు చేసి మళ్లీ తెరకెక్కిస్తారు. ‘తమిళ్ లో తీస్తే.. తెలుగులో కూడా ఆడతాయి’ అనే డైలాగ్ ఉంది. ముఖాలు తెలియకపోయినా తమిళ సినిమాలను తెలుగు ప్రజలు ఆదరిస్తారు. ఇదే ఫార్ములా తెలుగు సినిమాలే కాదు.. మరే భాషా సినిమాలు మరెక్కడా దాదాపు వర్కౌట్ కావు. అందుకే పరిచయం లేని నటులు కాబట్టి మిగిలిని భాషల్లో రీమేక్స్ చేస్తారు. ఇలా రీమేక్స్ చేయడం సహజమైన విషయమే. ప్రస్తుతం తెలుగులో సూపర్ హిట్ అయిన ఓ క్రైమ్ కామెడీ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుంది.
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 2019లో తెరకెక్కిన ‘బ్రోచేవారెవరురా..’ సినిమా హిందీలో తెరకెక్కుతోంది. ఈ సినిమా రీమేక్ హక్కులను స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుంది. హిందీలో కూడా దేవన్ ముంజల్ అనే కొత్త దర్శకుడితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. లీడ్ రోల్స్ లో అభయ్ డియోల్, కరణ్ డియోల్.. మరికొంతమంది కొత్త నటీనటులతోనే తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగులో క్రైమ్ కామెడీ కథనంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకాదరణ దక్కించుకుంది.
నివేధా ధామస్, నివేదా పేతురాజ్, సత్యదేవ్, శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ .. తదితరులు నటించారు. మన్యం ప్రొడక్షన్స్ బ్యానర్ పై విజయ్ కుమార్ మన్యం ఈ సినిమాను నిర్మించారు. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించారు. 2019లో వచ్చిన హిట్ సినిమాల్లో బ్రోచేవారెవరురా.. కూడా నిలిచింది. ముగ్గురు కాలేజీ యువకులు, యువతి, ఓ హీరోయిన్, కొత్త దర్శకుడు.. చుట్టూ కిడ్నాప్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. సస్పెన్స్ కూడా మిళితం కావడంతో ప్రేక్షకుల్ని ఈ సినిమా ఆకట్టుకుంది. క్రైమ్ కామెడీ సినిమాలకు బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ ఉంటుంది. మరి.. అక్కడ ఈ సినిమా ఎటువంటి ఫలాన్ని ఇస్తుందో చూడాలి.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!