రీసెంట్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `అల…వైకుంఠపురములో..` ఓ సాంగ్ రిలీజైన సంగతి తెలిసిందే. `సామజవరగమన నిను చూసి ఆగగలనా..` అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 24 గంటల్లో ఈ పాట ఐదు మిలియన్స్ వ్యూస్ను దాటేసింది. తమన్ సంగీత సారథ్యం వహిచిన ఈ సాంగ్ను సిద్ శ్రీరామ్ పాడారు. ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ పాటను రాశారు. త్వరలోనే మరిన్ని సాంగ్స్ ఈ సినిమా నుండి విడుదల కానున్నాయి. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో టబు కీలక పాత్రధారిగా నటిస్తుంది.
previous post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!