SVP: సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో నటించిన “సర్కారు వారి పాట” మే 12వ తారీకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయి కలెక్షన్ లు కొల్లగొట్టింది. దీంతో సినిమా యూనిట్ కర్నూలులో విజయోత్సవ సభ నిర్వహించడం తెలిసిందే. అయితే ఈ సభలో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ కూడా డాన్స్ వేయనీ మహేష్… సడన్ గా స్టేజి పైకి వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు… మరికొంతమంది డ్యాన్సర్ల తో స్టెప్పులు వేయడం.. సంచలనంగా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ వీడియో కూడా ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటువంటి తరుణంలో తాజాగా మహేష్ “సర్కారు వారి పాట” విజయోత్సవ సభలో స్టెప్పులు వేయడం పై.. పరోక్షంగా అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళితే గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆధ్వర్యంలో గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” సినిమా తెరకెక్కింది. త్వరలోనే ఈ సినిమా థియేటర్ లోకి రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అల్లు అరవింద్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకుడికి ఇప్పుడు ఎక్కువగా ఓటిటిలో మంచి కంటెంట్ దొరుకుతుంది.
సో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం చాలా కష్టతరం అయిపోయింది. ఇటువంటి తరుణంలో సినిమా హీరోలు చాలా కీలకంగా వ్యవహరించాలి. మామూలుగా గోపీచంద్ కి సిగ్గు ఎక్కువతో పాటు వేడుకలకు కూడా పెద్దగా రాడు. కానీ ఇటీవల ఓ పెద్ద హీరో తన సినిమా విజయోత్సవ సభలో స్టేజిపై స్టెప్పులు వేయడం జరిగింది. ఈ క్రమంలో ఎవరికి వాళ్లు హీరోగా సినిమా చేసిన గాని …సినిమా ని సొంతంగా భావించి… ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి అని అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాలాంటివారు ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తే పెద్దగా ఎవరూ చూడరు. హీరో హీరోయిన్ లు… ఎక్కువ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనాలని.. పేర్కొన్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!