Allu arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’. తాజాగా దీని నుంచి ఫ్యాన్స్కు పూనకాలొచ్చే అప్డేట్స్ వచ్చాయి. సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన పుష్ప: ది రైజ్ పార్ట్ 1 అఖండ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దరిదాపులో మరో భారి తెలుగు చిత్రం లేకపోవడంతో విడుదలైన అన్నీ చోట్ల పుష్ప పార్ట్ 1 వసూళ్ళ సునామీని సృష్ఠించి అల్లు అర్జున్కు, దర్శకుడు సుకుమార్కు పాన్ ఇండియన్ స్టార్గా క్రేజ్ తీసుకువచ్చింది. ఇక ఫిబ్రవరి నెల నుంచి దీనికి సీక్వెల్ మూవీ ‘పుష్ప: ది రూల్’ చిత్రీకరణ ప్రారంభం అవబోతోంది.
దాంతో పార్ట్ 1లో దొర్లిన కొన్ని లోపాలను సరిచేస్తున్నారు. దానికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఇవేనంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో చాలా శ్రద్ద తీసుకోవాల్సిందిగా రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్కు సూచనలు వెళ్ళాయట. పుష్ప 1 భారీ హిట్ సాధించింది. బాలీవుడ్ స్టార్ కూడా మ్యూజిక్ విషయంలో దేవీని పొగిడేశారు. అయితే ఇంతకంటే అద్భుతంగా సాంగ్స్ గానీ, బీజీఎం గానీ ఇవ్వొచ్చునని అభిమానులు ..కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
Allu arjun: పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2 మీదే యూనిట్ మొత్తం బాగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది.
అందుకే పార్ట్ 2 మీద డీఎస్పీ స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడట. పార్ట్ 1 కంటే అద్భుతంగా పార్ట్ 2 సాంగ్స్ ఇవ్వడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడని..ఇప్పటికే సాలీడ్ ట్యూన్స్ రెడీ చేసినట్టు సమాచారం. ఇక స్పెషల్ సాంగ్లో నర్తించిన సమంత అంత ఆకట్టుకోలేదని కామెంట్స్ వినిపించాయి. అందుకే ఈ సారి బాలీవుడ్ ఐటెం భామను దింపాలని చూస్తున్నారట. ఇక మేకింగ్ పరంగానూ సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అసలు కథ ఉంది పార్ట్ 2లోనే అని దాన్ని అద్భుతంగా తెరమీదకు తీసుకు రానున్నాడని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప పార్ట్ 1 కంటే పార్ట్ 2 మీదే యూనిట్ మొత్తం బాగా శ్రమిస్తున్నారని తెలుస్తోంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!