టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై అమృత న్యాయపోరాటానికి రెడీ అవుతుంది. అమృతా -ప్రణయ్ జీవితానికి సంబంధించిన విషయాలను “మర్డర్” సినిమా టైటిల్ తో రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ మరియు కొత్తగా ఒక పాట కూడా విడుదల అవ్వడం జరిగింది. అయితే విడుదలైన ట్రైలర్ మరియు పాటలో సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉండే విధంగా ఉండటంతో అమృతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సినిమాలో లేనిది ఉన్నట్టుగా “మర్డర్” సినిమాని తన జీవితానికి సంబంధించింది అన్నట్టుగా చిత్రీకరించడానికి కుట్ర పన్నుతున్నారని, వెంటనే ఈ సినిమా విడుదలను నిలిపి వేయాలని, డైరెక్టర్ వర్మ పై అమృత న్యాయ పోరాటానికి దిగుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ప్రవేట్ పిటిషన్ దాఖలు చేశారు.
అమృత వేసిన పిటిషన్ ను న్యాయస్థానం ఎస్సీ, ఎస్టీ కోర్టుకు ఫార్వర్డ్ చేసింది. దీనిపై స్పందించిన కోర్టు ఈ నెల 6 వ తారీఖున సినిమాకి సంబంధించి డైరెక్టర్ మరియు నిర్మాతలు కోర్టుకు హాజరు కావలసిందిగా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కరోనా నేపథ్యంలో అడ్వకేట్ ఈ-మెయిల్ మరియు వాట్సాప్ ద్వారా దర్శక నిర్మాతలకు నోటీసులు న్యాయస్థానం పంపించింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!