తెలుగు సినీ పరిశ్రమను లీడ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారం లాంటి వార్త అందించినట్లు తెలుస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు సినీ పెద్దలు అటు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలవడం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయి చర్చించిన విషయం తెసిందే. ఇదే క్రమంలో ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు టాలీవుడ్ నిర్మాతల మండలి లేఖ రాయడంతో అయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి, సమస్యలపై చర్చించేందుకు చిరంజీవి నేతృత్వంలో సినీ పెద్దలు ఎప్పుడైనా తనను కలువవచ్చని ఏపి జగన్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. పనిలో పనిగా విశాఖను పరిపాలనా రాజధానిగా అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఉన్న జగన్ తెలుగు చిత్ర పరిశ్రమనూ విశాఖలో అభివృద్ధి చేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్ది మూడు రాజధానుల ప్రకటన చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీలతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులకు అండగా ఉంటామని, రాజధానిని విశాఖ తరలించడానికి వీలులేదంటూ ప్రకటించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటనను చిరంజీవి స్వాగతించారు. ఈ క్రమంలోనే చిరు, జగన్ ల మధ్య మైత్రి బంధం ఏర్పడిందని, సినీ పరిశ్రమ అభివృద్ధికి విశాఖ అనువైన ప్రదేశం అని ఇద్దరు భావించినట్టు వినికిడి. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమను విశాఖలో అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అందుకు అవసరమైన ప్రణాళికతో రావాలని జగన్ చిరంజీవికి సూచించారట!.
ఈ నేపథ్యంలో చిరంజీవి నేతృత్వంలోని సినీ పెద్దల బృందం వచ్చే నెల ఒకటి లేదా రెండవ వారంలో జగన్ అపాయింట్మెంట్ తీసుకొని అమరావతికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు టాలీవుడ్ శ్రేణులు. అయితే ఇది ఇలా ఉండగా తెలంగాణ ముఖ్య మంత్రి కెసిఆర్ ను సినీ పరిశ్రమ పెద్దలు కలిసిన సమయంలో తనకు ఆహ్వానించలేదని ఫీల్ అవుతున్న బాలకృష్ణ ను జగన్ తో జరిగే సమావేశానికి ఆహ్వానిస్తారా?, ఒక వేల ఆహ్వానిస్తే బాలకృష్ణ..జగన్ వద్దకు వస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!