Varun Tej Lavanya Tripathi: తెలుగు రాష్ట్రాలలో జ్యోతిష్యుడు వేణు స్వామి అందరికీ సుపరిచితుడే. చాలామంది సినీ సెలబ్రిటీల జీవితాలలో అదేవిధంగా రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ నిత్యం వార్తలలో నిలుస్తుంటారు. అంతేకాదు దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా నాయకుల జాతకాలు బట్టి తర్వాత జరగబోయే విషయాలను ముందుగానే తెలియజేస్తుంటారు. గతంలో నాగచైతన్య మరియు సమంత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదే సమయంలో మెగా కుటుంబం పై కూడా అనేక కామెంట్లు చేశారు.
కచ్చితంగా 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. చంద్రబాబు నాయుడు కచ్చితంగా జైల్లోకి వెళ్తారని.. ఇలా ముందుగానే వేణు స్వామి కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. అయితే ఈ రకంగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా గెలుస్తారని ఆయన చెప్పిన జ్యోతిష్యం ఇటీవల ఫెయిల్ అయ్యింది. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ విషయంలో వేణు స్వామి పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగా కుటుంబానికి చెందిన హీరో వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి జాతకాలు గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి జాతకాలలో గురువు, శుక్రుడు నీచంగా ఉన్నారు. నాకు తెలిసి వాళ్ళిద్దరూ భవిష్యత్తులో కలిసి ఉండే అవకాశాలు లేవు. లావణ్య త్రిపాటికి కుజ దోషం ఉంది. వరుణ్ తేజ్ కు నాగదోషం ఉంది. ఇద్దరి కుటుంబాలలో ఓ ప్రముఖమైన స్త్రీ మూలంగా విడిపోయే అవకాశం ఉంది. గతంలో నాగచైతన్య సమంత విడిపోతారని ముందుగానే చెప్పాను ఇప్పుడు వరుణ్ లావణ్య త్రిపాఠి విషయంలో ముమ్మాటికీ నా మాటలు నిజమవుతాయి అంటూ వేణు స్వామి ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కామెంట్లపై మెగా అభిమానులు మండిపడుతున్నారు. నువ్వు చెప్పేవన్నీ నిజం కావులే అంటూ సెటైర్లు వేస్తున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!