Veera Simha Reddy: నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి” జనవరి 12వ తారీకు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇటీవల జనవరి ఆరవ తారీకు ఒంగోలులో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బాలయ్య కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదే సమయంలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో దూసుకుపోతుంది. బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఫ్యాక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈరోజు “వీరసింహారెడ్డి” సెన్సార్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది. బాలకృష్ణ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది. దిలీప్ విజయ్ విలన్ పాత్రలో మెప్పిస్తున్నాడు. తమన్ అందించిన మ్యూజిక్ సైతం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. “అఖండ” సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలెట్ గా నిలిచింది. అదే తరహాలో “వీరసింహారెడ్డి” కి తమన్ ఎక్స్ట్రార్డినరీ అవుట్ ఫుట్ ఇచ్చినట్లు పాటలు బట్టి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలలో మొదట బాలయ్య “వీరసింహారెడ్డి” రిలీజ్ అవుతుండగా తర్వాత రోజు చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య” రిలీజ్ అవుతుంది. సంక్రాంతి బరిలో ఈ రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. అంతేకాదు ఈ రెండు సినిమాలలో హీరోయిన్ శృతిహాసన్ కావడం విశేషం.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!