Bhoothaddam Bhaskar Narayana: శివ కందుకూరి నటించిన ప్రత్యేకమైన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ” భూతద్దం భాస్కర్ నారాయణ ” ప్రచార కంటెంట్ తో భారీ బజ్ సృష్టించింది. పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని స్నేహల్, శశిధర్, కార్తీక్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా మార్చ్ 1న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఇక ఈ సినిమాలో కథానాయకగా నటించిన రాశి సింగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాశి సింగ్ మాట్లాడుతూ..” మాది రాయపూర్. ఢిల్లీ యూనివర్సిటీలో చదువును కంప్లీట్ చేశా. సినీ ఫీల్డ్ లోకి రాకముందు ఏడాది పాటు ఎయిర్ హౌస్ట్స్గా కూడా పని చేశా. కానీ చిన్నప్పటినుంచి సినిమా ఇండస్ట్రీపై మక్కువ ఉండడంతో హీరోయిన్ అవ్వాలని ఆశతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టా. ఎంతో కృషి చేసి సినిమాల్లోకి వచ్చాను.
సంతోష్ శోభన్ నటించిన ప్రేమ్ కుమార్ అనే సినిమా గత ఏడాది విడుదలైంది. ఇప్పుడు శివ కందుకూరి తో భాస్కర్ నారాయణ భూతద్దంలో నటించాను. మా కుటుంబం మొత్తం మొదట్లో ముంబైలో ఉండేవాళ్లం. ఇప్పుడు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యాము. నాకు టాలీవుడ్ ఇండస్ట్రీ అన్న హైదరాబాద్ అన్న చాలా ఇష్టం. అందువల్లే నేను తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నాను. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా కాలం నుంచి నెతుకుతున్నారు.
తెలుగు రాకతో పాటు కొత్త అమ్మాయి కోసం ప్రయత్నిస్తున్నారు మేకర్స్. అలాంటి సమయంలో అనుకోకుండా ఈ సినిమా ఆడిషన్స్ కు నేను హాజరయ్యాను. ఈ సినిమాకు నేనే సరైన దానిని అని దర్శకుడు భావించడంతో ఈ సినిమాలో నన్ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇందులో నా పాత్ర పేరు లక్ష్మి. చాలా సహజంగా ఉంటుంది. ఇందులో అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉన్నాయి. నేను ఈ మూవీ లో రిపోర్టర్ గా కనిపిస్తా. ఈ సినిమా విడుదల అనంతరం మీరు తప్పకుండా నన్ను మెచ్చుకుంటారు ” అంటూ వెల్లడించింది రాసి సింగ్. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!