టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలా మైండ్ బ్యాలెన్సింగ్ గేమ్ ఆడిన దేవి నాగవల్లి ఎలిమినేషన్ వెనుకాల కుట్ర ఉందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి. కాగా బయటకు వచ్చిన నాగవల్లి ప్రముఖ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ బిగ్ బాస్ హౌస్ అనుభూతి గురించి అనేక విషయాలు తెలియ జేస్తుంది. తాను బిగ్ బాస్ ని బ్లైండ్ గా నమ్మి వెళ్లానని అంత జెన్యూన్ గా జరుగుతుంది అనుకుంటే…. తన ఎలిమినేషన్ ఎపిసోడ్ ప్రోమో అప్పటికప్పుడు తయారు చేయటం విషయం తెలిసి ఇదంతా ట్రాప్ అని భలైపోయినట్లు తెలుసుకున్న అని యాంకర్ దేవి నాగవల్లి తెలిపింది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మరికొంతమంది నేను టీవీ9 యాంకర్ అని… వాళ్ల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం వల్లే తనని ఎలిమినేట్ చేసినట్లు వస్తున్న వార్తలు తెలుసుకుని బాధ పడ్డాను. జీవితంలో నిజమైన పెయిన్ ఎలిమినేట్ అయిన రోజు అనుభవించాను అని చెప్పుకొచ్చింది. తాను దాసరి మనవరాలిని అని తాజాగా బయటపడిన విషయం గురించి స్పందిస్తూ… ఈ విషయం ముందే తెలిస్తే కచ్చితంగా తనని ఎలిమినేట్ అవ్వాలనుకున్నా హీరో అభిమానులు సేవ్ చేసే అవకాశం ఉండేదని చెప్పుకొచ్చింది.
కానీ నాకు క్యాస్ట్ పరంగా అలాంటి ఫేమ్ నాకు రాకూడదు, ఆ షేడ్ నా మీద పడకూడదు…. దేవి నాగవల్లి కి ఉన్న క్రేజ్… ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటే సరిపోతుంది. అందుకే ఇప్పటివరకు ప్రొఫెషనల్ గా కూడా ఆ విషయాన్ని బయటకు రానివ్వలేదు అని చెప్పుకొచ్చింది. దాసరి మనవరాలిని అయినా ఈ విషయం ఇప్పుడు బయటకు రావడానికి కారణం మా అమ్మ అని తెలిపింది.
ఆమెకు తన ఫ్యామిలీ గురించి చెప్పడం ఆమె ఇష్టమని… కానీ తనకి మాత్రం అలా చెప్పుకోవటం ఇష్టం లేదని దేవి నాగవల్లి స్పష్టం చేసింది. బిగ్బాస్ హౌస్ లోకి ఎంటర్ అవ్వకముందు నేను దాసరి మనవరాలిని అని చెప్పుకునే వెళ్లి ఉంటే నేను ఇప్పటిదాకా గెలవకూడదు అని భావించిన వాళ్ళ ఓట్లు వేసే వారని. కానీ నాకు అలాంటి గేమ్ ఇష్టం లేదని… దేవి నాగవల్లి ఇండైరెక్ట్గా క్యాస్ట్… దాన్ని దృష్టిలో పెట్టుకుని బతికేవారీ పై చురకలు అంటించింది.