Bigg Boss OTT: వివిధ భాషల్లో మంచి విజయం సాధించిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్.. తెలుగులోనూ ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటి వరకు టీవీలో గంట మాత్రమే అలరించిన ఈ షో.. 24/7 ఎంటర్టైన్ చేసేందుకు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందు వచ్చేసింది. డిస్నీ ప్లాస్ హాట్స్టార్లో `బిగ్బాస్ నాన్స్టాప్` పేరుతో ఫిబ్రవరి 26 సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది.
కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తుండగా.. మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్, అషూ రెడ్డి, శ్రీరాపాక, మోడల్ అనిల్ రాథోడ్, నటి మిత్ర శర్మ, తేజస్వీ, సరయు, యాంకర్ శివ, హీరోయిన్ బిందు మాధవి, హమిదా, అఖిల్ సార్థక్, యాంకర్ స్రవంతి, ఆర్జే చైతూ, అరియానా, నటరాజ్ మాస్టర్లు కంటెస్టెంట్స్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
ప్రస్తుతం ఓటీటీ బిగ్బాస్ సూపర్ స్వింగ్లో దూసుకుపోతోంది. మరోవైపు హాట్స్టార్కు సబ్స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. అయితే ఇలాంటి తరుణంలో `బిగ్బాస్ నాన్స్టాప్`కు బ్రేక్ పడింది. రోజూ లైవ్ స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో.. బుధవారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ఆగిపోయింది. దీంతో ఏం జరిగిందో తెలీక బిగ్బాస్ లవర్స్ జుట్టు పీక్కుంటున్నారు.
అయితే లైవ్ స్ట్రీమింగ్ ఆగిపోవడంపై హాట్స్టార్ వారు క్లారిటీ ఇచ్చారు. `మరింతగా నాన్ స్టాప్ వినోదాన్ని అందించేందుకు ఇంటిని సిద్ధం చేస్తున్నాం.. గురువారం అర్దరాత్రి 12 గంటల నుంచి లైవ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఏరోజుకు ఆరోజు పూర్తి ఎపిసోడ్ను రాత్రి 9 గంటలకు విడుదల అవుతుంది. తప్పక చూడండి` అని పేర్కొన్నారు. ఏదేమైనా గత శనివారం మొదలైన ఈ షో అప్పుడే ఆగిపోవడంతో.. బిగ్బాస్ ప్రియులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!