లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విషయంలో అనుకున్నట్లే అయ్యింది. ఈ సినిమా తెలుగు దేశం పార్టీతో పాటు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఫ్యామిలీ సభ్యులను కించ పరిచేలా ఉందంటూ విమర్శలు వచ్చాయి. దేవినేని బాబు అనే వ్యక్తి `లక్ష్మీస్ ఎన్టీఆర్`ను ఆపాలని.. తెలుగుదేశం పార్టీని కించపరిచేలా సినిమా ఉందని.. ఎన్నికలు సమయం కనుక ఈ సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ ఎలక్షన్ కమీషన్కు పిర్యాదు చేశాడు. ఎలక్షన్ కమీషన్ .. ఈ గొడవ తమ పరిధిలోకి రాదని సెన్సార్ బోర్డే చూసుకోవాలని సూచించింది. అయితే సెన్సార్ బోర్డు `లక్ష్మీస్ ఎన్టీఆర్` సినిమా.. తెలుగు దేశం పార్టీకి సంబంధించి ఎన్నికల్లో ప్రభావం చూపేలా ఉంది కాబట్టి, ఎన్నికల తర్వాత సినిమాను రిలీజ్ చేసుకోవాలని సూచించింది. అయితే దీనిపై రాంగోపాల్ వర్మ మండిపడుతున్నాడు. అసలు సెన్సార్ బోర్డుకు సినిమా ఆపే హక్కు లేదని..తాను న్యాయ పోరాటం చేస్తానంటూ సోషల్ మీడియా ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
previous post