రచయిత, నిర్మాత కోన వెంకట్పై హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. కోన వెంకట్ తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ జెమినీ వి.ఎఫ్.ఎక్స్ డైరెక్టర్ ప్రసాద్ కేసు ఫైల్ చేశాడు. వివరాల ప్రకారం ఓ సినిమాకు కథను అందిస్తానని కోన వెంకట్ 2017లో డబ్బులు తీసుకున్నాడట. అయితే ఇప్పటి వరకు కథను ఇవ్వలేదట. కథ ఇవ్వడం లేదు కదా!.. డబ్బులైనా తిరిగివ్వండని కోన వెంకట్ను అడిగితే బెదిరిస్తున్నాడని కంప్లైంట్లో పేర్కొన్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న `నిశ్శబ్దం` చిత్రానికి కోన వెంకట్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!