Taapsee-Chiranjeevi: ప్రముఖ హీరోయిన్ తాప్సీకి మెగాస్టార్ చిరంజీవి సాయం చేసేందుకు వస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న తాప్సీ.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్జే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తుండగా.. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 1న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మిషన్ ఇంపాజిబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఖరారు చేశారు.
హైదరాబాదు వెస్టిన్ హోటల్ లో రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గెస్ట్గా రాబోతున్నారు. ఈ విషయాన్ని కొద్ది సేపటి క్రితమే మేకర్స్ ప్రకటించారు. చిరంజీవి గెస్ట్గా వస్తే సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం. ఇది ఒక రకంగా తాప్సీకి చిరు సాయం చేస్తున్నట్టే అవుతుంది.
కాగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా.. ఇందులో బాలనటులు రోషన్, భానుప్రకాశ్, జైతీర్థ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా తాప్సీ నటించింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ను పట్టుకుంటే డబ్బులిస్తారనే ముగ్గురు చిన్నారుల ఆశ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంది. మార్క్ కె. రాబిన్ స్వరాలు అందిస్తున్నారు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!