Cinima: మహమ్మారి కరోనా కారణంగా సినిమా ధియేటర్లు ఏప్రిల్ మాసం మధ్య నుండి క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా ఇండియాపై తీవ్రత అధికంగా చూపించడం జరిగింది. రెండోసారి వచ్చిన మహమ్మారి వల్ల దేశంలో చాలా మంది చనిపోవడం మాత్రమే కాక సెలబ్రిటీలు ఇంకా రాజకీయ నాయకులు సైతం.. కరోనా బారిన పడి మరణించడం జరిగింది. ఏకంగా దాదాపు రోజుకి కొత్త కేసుల విషయంలో ఐదు లక్షలకు దగ్గరగా పరిస్థితి మారటంతో దేశంలో ప్రభుత్వాలు మొత్తం ఉక్కిరి బిక్కిరి అయిపోయాయి.
ముఖ్యంగా ఆక్సిజన్ సిలిండర్లు లేక .. అనేక ప్రభుత్వాలు అవస్థలు పడ్డాయి. ఇటువంటి తరుణంలో లాక్ డౌన్ ఏకైక మార్గమని దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం .. సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ లో చేయటం తెలిసిందే. ఈ పరిణామంతో కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మర్ బిజినెస్ అటకెక్కింది. చాలా సినిమాలు రిలీజ్ కావల్సి ఉండగా మొత్తం వాయిదా పడ్డాయి. ఇదిలా ఉంటే మళ్లీ సినిమా థియేటర్లు వచ్చే నెల అనగా జూలై మాసం మధ్యలో 50% ఆక్యుపెన్సీ తో ఓపెన్ చేసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
Read More: Tollywood: సౌత్ ఇండియా బిగ్ డైరెక్టర్ కి మరో ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు..??
ప్రజెంట్ సినిమా థియేటర్లు ఓపెన్ అయితే వరుసపెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి. మరి ప్రేక్షకులు థియేటర్లకు వెళతారో లేదో అన్నది ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు సందేహం నెలకొంది. ఎందుకంటే కరోనా సెకండ్ వేవ్ .. తీవ్రత అధికంగా చూపించడంతో పాటు దాదాపు అందరినీ టచ్ చేయడం జరిగింది. ఆరు సినిమా హాల్ లో ఓపెన్ అయితే ప్రేక్షకులు వస్తారా లేదా అన్నది చూడాలి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!