టాలీవుడ్ యాక్షన్ హీరోగా పిలుచుకునే గోపీచంద్ మరోసారి సంపత్ నందితో కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్గా ఈ సినిమాను అనౌన్స్ కూడా చేశారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటిస్తుందని సమాచారం. సమంతతో గత ఏడాది `యూ టర్న్` నిర్మించిన శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాకు నిర్మాత. అక్టోబర్ నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గోపీచంద్తో తమన్నా తొలిసారి జత కడుతుంది. అయితే సంపత్ నంది దర్శకత్వంలో మాత్రం రెండోసారి నటిస్తుంది. సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్లోనూ తమన్నా హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!