Harish Shankar: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని కుర్ర డైరెక్టర్లలో మొదటి వరుసలో హరీష్ శంకర్ పేరు వినబడుతుంది. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో “గబ్బర్ సింగ్” వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. అంతకుముందే షాక్, మిరపకాయ వంటి సినిమాలు చేయడం జరిగింది. కానీ పవన్ తో చేసిన “గబ్బర్ సింగ్” తో వార్తల్లో నిలిచాడు. పైగా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని కావడంతో… మరింత క్రేజ్ హరీష్ కి దక్కింది. ఆ తర్వాత మెగా హీరోలలో సాయి ధరంతేజ్ ఇంకా బన్నీ లతో సినిమాలు చేయడం జరిగింది.
ఇదిలా ఉంటే బన్నీ తో చేసిన “దువ్వాడ జగన్నాథం” “డీజే”.. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి.. హరీష్ శంకర్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తెలుగులో వచ్చిన డీజే సినిమా అంతగా ప్రేక్షకులను అలరించలేదు. కానీ ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీ లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటుతూ ఉండటంతో… ముఖ్యంగా “బాహుబలి” తో టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ పెరిగిపోవడంతో ఇక్కడ సినిమాలు… బాగా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా డైరెక్టర్ హరీష్ శంకర్ డిజె సినిమా ని సిద్ధార్థ మల్హోత్రా తో బాలీవుడ్ లోకి రీమేక్ చేయడానికి రెడీ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పద్య రీతిలో స్క్రిప్ట్ లో హరీష్ కొన్ని మార్పులు చేసినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ తో రెండో సినిమా “భవదీయుడు” స్టార్ట్ చేసే ఆలోచనలో హరీష్ ఉన్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ పడటంతో ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్.. భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!