హీరోహా సిద్ధార్థ్ టాలీవుడ్ ..కోలీవుడ్..బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. బొమ్మరిల్లు సినిమాతో తెలుగులో స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నాడు. బాలీవుడ్ లో రంగ్ దే బసంతి సినిమాతో అక్కడ కూడా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక తమిళంలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోగా, నిర్మాతగా మంచి క్రేజ్ సాధించాడు. అయితే గత కొన్నాళ్ళుగా సిద్ధార్థ్ నటించిన సినిమాలు అటు తమిళం లో గాని ఇటు తెలుగులో గాని సక్సస్ కావడం లేదు. దాంతో సినిమాలు తగ్గిపోయాయి.
ప్రస్తుతం ఈ హీరో ఒక సినిమాని కమిటయ్యాడని తాజా సమాచారం. ఆర్ ఎక్స్ 100 ని తెరకెక్కించి సంచలన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న అజయ్ భూపతి ఒక సినిమాని తెరకెక్కించడానికి గత కొన్ని నెలలుగా సన్నాహాలు చేసుకుంటున్నాడు. మహాసముద్రం అన్న టైటిల్ తో ఈ సినిమాని తెరకెక్కించడానికి చాలా మంది హీరోలని అప్రోచ్ అయ్యాడు. అయితే ముందు అనుకున్న మాస్ మహారాజా రవితేజతో పాటు నాగచైతన్య తప్పుకోవడంతో చివరికి హీరో శర్వానంద్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ తో పాటు మరో హీరోగా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
వైజాగ్ బ్యాగ్డ్రాప్ లో క్రైమ్ థ్రిల్లర్ గా మహాసముద్రం తెరకెక్కనుందని సమాచారం. అయితే ఇన్నాళ్ళు హీరోగా అవకాశాలు లేక ఖాళీగా ఉన్న సిద్ధార్థ్ చాలా కాలానికి తెలుగులో అవకాశం రావడం తో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయినప్పటికి కమిటయ్యాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమా సక్సస్ ఈ ముగ్గురికి చాలా కీలకం అని చెప్పాలి. శర్వానంద్ కి ఈ మధ్య కాలంలో సక్సస్ దక్కలేదు. దాంతో ఈ సినిమా మీద శర్వా కూడా నమ్మకంగా ఉన్నాడు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!