బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే కాలేయానికి సంబంధించిన అనారోగ్యానికి గురయ్యారు. చాలా అరుదుగా వచ్చే ఈ ట్యూమర్ గురించి ఇర్ఫాన్ తన ట్విట్టర్ ద్వారా ఏడాది క్రితమే అందరికీ తెలియజేశారు. చికిత్స కోసం లండన్ వెళుతున్నట్లు కూడా చెప్పారు. లండన్ వెళ్లిన ఆయన స్పెషలిస్టుల పర్యవేక్షణలో ఏడాది పాటు చికిత్స తీసుకున్నారు. ఇప్పుడు ఆ ట్యూమర్ పోయింది. పూర్తిగా స్వస్థత చేకూరడంతో లండన్ నుండి ముంబై చేరుకున్న ఇర్ఫాన్ ఖాన్.. మళ్లీ సినిమాల్లో నటించడానికి సమాయత్తమవుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆ విషయాన్ని తెలియజేస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ను పోస్ట్ చేశారు. “మనం గెలవాలనే తాపత్రయంలో మనల్ని ప్రేమిస్తున్న, అభిమానిస్తున్న వారి గురించి మరచిపోతుంటాం. మనం ఏమీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు వారందరూ మనకు గుర్తుకు వస్తారు. అలా నన్ను ప్రేమించిన, అభిమానించిన వారందరికీ దన్యవాదాలు. మీ ప్రేమ, అభిమానమే నన్ను కోలుకునేలా చేశాయి. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాను“ అని తెలిపారు ఇర్ఫాన్ ఖాన్. ఈయన త్వరలోనే `హిందీ మీడియం` సీక్వెల్లో నటించబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.
previous post
next post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!