Radhe shyam: భీమ్లా నాయక్ సినిమా వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద మూడేళ్ళ తర్వాత మళ్ళీ అదే సందడి హంగామా కనిపించింది. అంతేకాదు అభిమానులు కోరుకున్నట్లుగానే భీమ్లా నాయక్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పవన్ అభిమానులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సర్ ప్రైజ్ చేశాడు. అద్బుతంగా ఉంది భీమ్లా నాయక్ సినిమా.. అంటూ అభిమానులు. ప్రేక్షకులు అలాగే, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇప్పుడు అందరు ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. గత 3సంవత్సరాలుగా రాధేశ్యామ్ గురించిన అంతటా ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
అందుకు కారణం ప్రభాస్ 10 ఏళ్ళ తర్వాత లవ్ స్టోరితో అలరిచడానికి వస్తుండటమే. పూజా హెగ్డేతో జంటగా అంటే అందరిలోనూ అంచనాలు మరో స్థాయిలో నెలకొన్నాయి. ఎట్టకేలకు మార్చి 11వ తేదీన విడుదల చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలుసార్లు పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఏకంగా సోలో డేట్తో వస్తోంది. చిన్న చిన లోపాలు కూడా లేకుండా పక్కాగా అవుట్పుట్ రెడీ అయింది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్తో రాధేశ్యామ్ నిర్మించారు. సౌత్ భాషలతో పాటు హిందీలోనూ అలాగే, జపాన్, చైనా భాషలలోనూ రిలీజ్ కానుంది.
Radhe shyam: ఇప్పటికే ఆయన వాయిస్ ఓవర్ చెప్పేశారని తెలుస్తోంది.
అయితే, ఈ సినిమాకు వాయిస్ ఓవర్ హైలెట్ అవుతుందని ఈ మధ్య సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. హిందీ వెర్షన్కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ చెప్పినప్పటి నుంచి అంచనాలు మరీ పెరిగిపోయాయి. ఇక సౌత్ భాషల కు వాయిస్ ఇచ్చే స్టార్స్ వీరే అంటూ నెట్టింట వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపించింది. కానీ, ఇందులో నిజం లేదు. మహేశ్ బాబు వాయిస్ ఇస్తున్నారన్న వార్తలు అవాస్తవం. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి రాధేశ్యామ్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. ఆయన బేస్ వాయిస్తో కథ నేరేట్ చేసే విధానం ఆకట్టుకుంటుందని ఇప్పటికే ఆయన వాయిస్ ఓవర్ చెప్పేశారని తెలుస్తోంది. ప్రభాస్ – రాజమౌళిల మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే, ప్రభాస్ కోసం రాజమౌళి వచ్చారు.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!