కొరటాల శివ డైరెక్షన్లో NTR30 మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతుంది. అయితే ఈ సినిమాలో మొదట ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారు. సినిమాలో హీరోయిన్గా కియారా అద్వానీనే కావాలని ఎన్టీఆర్ పటుపట్టి కూర్చున్నాడు. కానీ ఆ అమ్మడు వేరే ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండటంతో NTR 30 మూవీ కోసం డేట్స్ ఇవ్వలేకపోతోంది.
హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ ఎంపిక
దాంతో సెకండ్ ఆప్షన్ గా అలియా భట్ ని కథానాయికగా సెలెక్ట్ చేసుకున్నారు. అలియా కూడా మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తరువాత కొన్ని పర్సనల్ కారణాల వల్ల ఆమె డేట్స్ ని క్యాన్సల్ చేసుకుంది. ఈ నేపథ్యంలో రష్మిక మందన NTR30 లో కనిపించబోతుందనే టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ఫైనల్ గా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఎన్టీఆర్ సరసన నటించబోతుంది అనే టాక్ వినబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కూడా జాన్వీ కపూర్ ని ఈ సినిమాలో ఫిమేల్ లోడ్ తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.
షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే
NTR30 సినిమాలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్లను కొరటాల శివ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు అని తెలుస్తుంది. అంతా ఓకే అయితే అక్టోబర్ 5 దసరా పండుగ రోజున పూజ చేసి NTR30 సినిమా షూటింగ్ ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. ఇక తారక్ ఈ సినిమా షూటింగ్ లో బిజీ అవుతాడు. ఈ సినిమా హిట్ కావడంతో తారక్కి తప్పనిసరిగా మారింది రాజమౌళి సినిమా చేసిన తర్వాత నెక్స్ట్ సినిమా కచ్చితంగా ఫెయిల్ అవుతుంది అనే సెంటిమెంట్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!