Kalyan Ram: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఒకపక్క నిర్మాతగా మరోపక్క హీరోగా విజయవంతంగా రాణిస్తున్నారు. రెండు పడవలపై బ్యాలెన్స్ గా ముందుకు సాగుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వరుసపరాజయాలతో సతమతమైన కళ్యాణ్ రామ్.. వశిష్ట దర్శకత్వంలో “బింబిసారా” అనే సినిమాతో సూపర్ హిట్ అందుకోవటం తెలిసిందే. ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ అద్భుతమైన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. సెంటిమెంట్ అదే విధంగా యాక్షన్.. సన్నివేశాలను డైరెక్టర్ వశిష్ట అద్భుతంగా చిత్రీకరించారు. “బింబిసారా” సినిమాతో కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వడం జరిగింది. “బింబిశార”తో ఫామ్ లోకి వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత “ఆమిగోస్” అనే సినిమా చేయడం జరిగింది.
రాజేందర్ రెడ్డి దర్శక తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “డెవిల్” అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో “డెవిల్” తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే ప్రాజెక్ట్ ఏంటి అనే దాని గురించి సోషల్ మీడియాలో.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ప్రేమ ఇష్క్ కాదల్ తో ఆకట్టుకున్న దర్శకుడు పవన్ సాదినేని.. ఇటీవల ఓటిటిలో “సేనాపతి”, “దయ” అనే వెబ్ సిరీస్ లతో అలరించడం జరిగింది. ఈ రెండు వెబ్ సిరీస్ ఓటీటీలో పెద్ద హిట్స్ అయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో నుండి పెద్ద హీరోల ఆఫర్స్ పవన్ సాధినేనికి రావడం జరిగాయట. దీనిలో భాగంగా కళ్యాణ్ రామ్ తో సినిమా చేయడానికి రెడీ కావడం జరిగిందట. కాగా నాలుగు సంవత్సరాల క్రితమే పవన్ సాదినేని కళ్యాణ్ రామ్ కోసం స్క్రిప్ట్ రెడీ చేయడం జరిగింది అంట. అంతేకాదు కళ్యాణ్ రామ్ కి వినిపించడం కూడా జరిగిందట. ఆ స్క్రిప్ట్ లో దివంగత నందమూరి హరికృష్ణకి కూడా రోల్ ఉందట.
ఈ క్రమంలో సినిమా స్టార్ట్ చేద్దామని అనుకున్న సమయానికి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆ తర్వాత పవన్ సాదినేని సినిమా కళ్యాణ్ రామ్ పక్కన పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే కథతో సినిమా చేయడానికి కళ్యాణ్ రామ్ డిసైడ్ అయ్యారట. ఈ సినిమాకి తానే నిర్మాతగా కూడా వ్యవహరించాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో.. హరికృష్ణ పాత్రలో ఎవరు నటిస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం “డెవిల్” ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత పవన్ సాదినేని ప్రాజెక్టు పట్టాలెక్కనున్నట్లు టాక్ నడుస్తోంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!