నందమూరి కళ్యాణ్ రామ్ “బింబిసార” అనే సినిమా చేయడం తెలిసిందే. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5వ తారీకు విడుదల కానుంది. మల్లాది వశిష్ట్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ‘బింబిసార’ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్ లు నటిస్తున్నారు. కేథరిన్, సంయుక్త మీనన్, వార్నియా హుస్సేన్లు కథానాయిక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే వెన్నెల కిశోర్, శ్రీనివాస రెడ్డి, బ్రహ్మాజీ కీలక పాత్రలలో కనిపించనున్నారు.
నిన్ననే జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదగా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ‘శరణు కోరితే ప్రాణభిక్ష..ఎదిరిస్తే మరణం’ అంటూ కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. హీరో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో రాజు పాత్రలో….మరోపక్క వర్తమాన కాలంలో వైవిద్యమైన పాత్ర చేస్తూ.. రెండు తరహాలలో సినిమాలో కనిపిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ ఇంటర్వ్యూలో “బాహుబలి” లో ప్రభాస్ పోషించిన రాజు పాత్ర పై కళ్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
మేటర్ లోకి వెళ్తే మల్లాది వశిష్ట్ ఫస్ట్ స్టోరీ చెబుతున్న సమయంలో రాజు పాత్ర చేయాలని.. అన్నప్పుడు నేను చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బాహుబలి లో ఆరడుగుల ఆజానుబావుడు ప్రభాస్ రాజుగా చేయగా.. అతని పాత్ర అందరి హృదయాలలో నాటుకుపోయింది. దీంతో ఈ సినిమాలో రాజు పాత్ర చేయడానికి చాలా భయపడ్డాను. బాహుబలి లో ప్రభాస్ కటౌట్ చూసి.. ప్రస్తుత జనరేషన్ లో రాజు అంటే ఇలానే ఉంటాడు అని ఊహించుకున్నారు. దీంతో “బింబిసార” లో రాజు పాత్ర చేయడానికి చాలా ఆలోచించాల్సి వచ్చిందని ధైర్యం చేసి చేసినట్లు.. కళ్యాణ్ రామ్ చెప్పుకోచ్చారు
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!