Karthika Deepam:బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.గత ఎపిసోడ్లో సౌందర్య, సౌర్యలు ఇద్దరు కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సౌర్య…సౌందర్యకి కాల్ చేసి మాట్లాడుతుంది. నాన్నమ్మ నేను మీ సౌర్యను అని అనడంతో ఈరోజు కథనం మరింత ఉత్కంఠగా మారింది. సౌర్య..సౌందర్యకు కాల్ చేసి నాన్నమ్మా.. బాగున్నావా?’ అనగానే సౌందర్య షాక్ అవుతుంది.ఇంతలో సౌర్య ‘నాన్నమ్మా నన్ను మరిచిపోయావా? నేను నీ సౌర్యను’ అంటుంది. ‘సౌర్యా.. ఎక్కడున్నావ్? నా బంగారం.. నా రౌడీ.. ఎక్కడున్నావే? ఇన్నాళ్లు ఏం అయిపోయావే.? ఎక్కడున్నావో చెప్పు.. ఇప్పుడే వచ్చేస్తాను అంటుంది. ఇంతలో జ్వాల(సౌర్య) ఫోన్ కట్ చేస్తుంది.ఇక సౌందర్య రెండు మూడు సార్లు తిరిగి కాల్ చేస్తుంది జ్వాలకు కానీ జ్వాల కాల్ కట్ చేస్తుంది. వెంటనే సౌందర్య ‘హిమకు జరిగిన విషయం చెబుతుంది. హిమ షాక్ అయిపోతుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Karthika Deepam: జ్వల ఎవరో అని ఆరా తీసే పనిలో పడ్డ స్వప్న :
అదే సమయంలో స్వప్న వచ్చి.. విషయం తెలుసుకుంటుంది. ‘చాలా సంతోషం.. ఇప్పుడైనా వెతకండి.. ఒకరిని అల్లంలా మరొకరిని బెల్లంలా చూడటం మానెయ్ మమ్మీ.. ఇద్దరినీ ఒకేలా చూడు అంటుంది. ఆవిడ కూడా వచ్చాక నా కొడుకులకి ముడిపెట్టాలని మాత్రం చూడొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చి.. అక్కడ నుంచి ఆవేశంగా వెళ్లిపోతుంది.ఇక జ్వల తన ఫోన్లోంచి సిమ్ తీసి అక్కడే పారేస్తూ.. ‘రేపటి నుంచి నాకోసం వెతుకుతారో లేదో చూడాలి’ అనుకుంటుంది.ఇక హిమ మనసులో.. ‘సౌర్య ఎందుకు ఫోన్ చేసింది?అని ఆలోచిస్తుంది..
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
పోలీసులతో జ్వాల కోసం వేట మొదలుపెట్టిన సౌందర్య:
సీన్ కట్ చేస్తే.. మరునాడు ఉదయాన్నే సౌందర్య పోలీసులతో పాటు సౌర్య ఫోన్ చేసిన ఏరియాకు వచ్చి ఆరా తీస్తుంది. అక్కడ పోలీసులతో కలిసి ఉన్న సౌందర్యని జ్వాల చూస్తుంది.నా కోసం వెతికిస్తున్నావా సీసీ.. థాంక్యూ.. నేనంటే ప్రేమ ఉందన మాట అని సౌందర్య దగ్గరకు వెళ్తుంది.ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి సౌందర్యను విసిగిస్తుంది సౌర్య. ఇక సౌందర్య కోపంగా అసలు ఎవరే నువ్వు? నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావ్? నన్ను ఫాలో చేస్తున్నావా? అంటే అదేమి లేదు నీతో పోలీసుల్ని చూసి నువ్వేమైనా కష్టంలో ఉన్నావేమో అని వచ్చాను’ అంటుంది సౌర్య. ‘అదేం లేదు.. నువ్వే అన్నావ్గా మనుషులు ఆశతో బతకాలి అని.. అలానే ఆశతో ఉన్నాను అంటుంది..ఇక హిమ జ్వాల ఇంటికి వెళ్తుంది. కాసేపటికి ఆటోలో జ్వాల వస్తుంది. ‘నిన్న నీ ఆటోని ఒక చోట చూశాను.. అక్కడ లేవేంటీ? ఎక్కడికి వెళ్లావా’ అంటూ ఆరా తీస్తుంది హిమ. ‘అవన్నీ ఎందుకులే తింగరీ’ అంటూ మాట దాటేస్తుంది జ్వాల. ఇక హిమ మనసులో.. ‘సౌర్య నాన్నమ్మకి ఫోన్ చేసి ఉండదు.. ఒకవేళ ఇదంతా స్వప్న అత్త ప్లాన్ అయ్యి ఉండొచ్చు..’ అని సరిపెట్టుకుంటుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తన గతం ఏంటో చెప్పిన స్వప్న :
సీన్ కట్ చేస్తే.. నిరుపమ్ హిమ గురించే బాధపడుతూ ఉంటుంది.ఇక స్వప్న నిరూపమ్ దగ్గరకు వచ్చి ‘నీకో విషయం చెప్పాలి నిరుపమ్? మీ డాడీ నేను ఎందుకు విడిపోయామో తెలుసా? అని గతం చెబుతుంది.మీ డాడీ నన్ను పెళ్లి చేసుకోకముందు ఒక అమ్మాయిని ప్రేమించాడట.. ఏవో కారణాల వల్ల ఆ అమ్మాయిని మీ డాడీ పెళ్లి చేసుకోలేకపోయారు. ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేస్తుంటే.. నేను సత్యని తప్పా వేరే వాళ్ళనిపెళ్లే చేసుకోను.. పిల్లల్నే కనను అని శపథం చేసిందట. కొన్నాళ్లకు ఆ అమ్మాయి వేరే వాళ్లని పెళ్లి చేసుకున్నా గాని ఆ అమ్మాయి ఇద్దరు పిల్లల్ని మీ డాడీతోనే కనింది..’ అంటూ నిరూపమ్ కు షాకిస్తుంది స్వప్న.మరి ఇంతకీ ఆవిడ ఎవరు… ఆ పిల్లలు ఎవరు అనే విషయాలు రాబోయే ఎపిసోడ్ లో చూడాలి.