KGF 2: కన్నడ రాక్స్టార్ యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `కేజీఎఫ్ చాప్టర్ 1` 2018లో విడుదలై ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్టాయిలో విడుదలైన ఈ చిత్రం.. అన్ని చోట్లు అఖండ విజయం సాధించి నిర్మాతలకు, బయ్యర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
ఇక ఇప్పుడు చాప్టర్ 1కు కొనసాగింపుగా `కేజీఎఫ్ చాప్టర్ 2` రాబోతోంది. యశ్, శ్రీనిది శెట్టి జంటగా కనిపించబోతుండగా.. సంజయ్ దత్, మాలవికా అవినాష్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రలను పోషించారు.హొంబాలే ఫిల్మ్స్ బ్యానర్పై విజయ్ కిరగందుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను గత నాలుగేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది.
దీంతో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్పై మంచి బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీరిలీజ్ బిజినెస్ ముగిసినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ 2 ఇక్కడ భారీ ధర పలికింది. నైజాం హక్కులను టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఏకంగా రూ.50 కోట్లకు దక్కించుకోగా.. ఏపీ+సీడెడ్ హక్కులు ఏకంగా రూ.60 కోట్లకు అమ్ముడైనట్లు టాక్ నడుస్తోంది.
ఒక డబ్బింగ్ చిత్రానికి ఈ స్థాయిలో బిజినెస్ జరగడమనేది విశేషం అనే చెప్పాలి. మొత్తానికి తెలుగు స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కేజీఎఫ్ 2 భారీ బిజినెస్ చేసి అందరికీ మైండ్బ్లాక్ అయ్యేలా చేసింది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!