`కె.జి.యఫ్ 1` చిత్రం సాధించిన విజయంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయ్యాడు. ఈ దర్శకుడితో సినిమా చేయాలని చాలా మంది టాలీవుడ్ స్టార్స్ అనుకున్నారు. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ కాంబినేషన్లో సినిమా రూపొందుతుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు యంగ్ టైగర్తో కాకుండా ప్రశాంత్ మహేశ్తో చేయాలనుకుంటున్నాడని, ఇటీవల మహేశ్ను కలిసి లైన్ చెప్పాడని దానికి మహేశ్ పాజిటివ్గానే స్పందించాడని వార్తలు వినపడుతున్నాయి. మహేశ్కు ప్రశాంత్ నీల్ చెప్పిన లైన్ నచ్చడంతో పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయమన్నాడట. అన్ని అనుకున్నట్లు కుదిరితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే ఏడాది సినిమా ఉండే అవకాశాలుంటాయని టాక్. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ `కె.జి.యప్ 2` సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!